Political News

స‌ర్పంచుల వెనుక ఆ కీల‌క నేత ఉన్నారా? వైసీపీ ఆరా!

రాష్ట్రంలో స‌ర్పంచులు తీవ్ర ఆందోళ‌న‌కు దిగుతున్న విష‌యం తెలిసిందే. వైసీపీకి మ‌ద్ద‌తు దారులుగా ఉండి.. గ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న స‌ర్పంచులు.. ఇప్పుడు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. త‌మ‌కు న్యాయం చేయ‌డంలేద‌ని, త‌మ చేతిలో చిల్లిగ‌వ్వ‌కూడా ఉండ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తు్న్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్పటికీ.. ఇప్పుడు మాత్రం మ‌రింత జోరు పెరిగింది.

చాలా మంది స‌ర్పంచులు నేరుగా సీఎం జ‌గ‌న్‌పైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఆందోళన‌ల‌ను కూడా ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, ఏకంగా క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల్లో అయితే జ‌గ‌న్ బొమ్మ ముందు పెట్టుకుని మ‌రీ స‌ర్పంచులు దీక్ష‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ వ‌ల్లే తాము న‌ష్ట‌పోయాయ‌మ‌ని, ఆయ‌న‌ను న‌మ్ముకుని ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, త‌మ నిధులు ప్రభుత్వం తీసుకుంద‌ని.. తిరిగి ఇవ్వాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

అయితే.. ఇలా జ‌రుగుతున్న ఈ ఉద్య‌మాల‌పై.. తాజాగా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నిక‌లకు ముందు ఇలా ఎందుకు జ‌రుగుతోంద‌నే విష‌యంపై సీఎం జ‌గ‌న్ ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన కొంద‌రు కీల‌క నేత‌ల‌ను ర‌ప్పించుకుని వారితో ఈ విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎక్క‌డైనా వ్య‌తిరేత‌కత రావొచ్చు కానీ, గ్రామీణ స్థాయిలో వ‌స్తే ఇబ్బందే.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ కీల‌క‌మైన స‌మాచారం తెప్పించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు తెలిసింది ఏంటంటే స‌ర్పంచుల‌కు వెనుకాల ఉండి.. వారిని ప్రోత్స‌హించి మ‌రీ ఉద్య‌మాల బాట‌ప‌ట్టిస్తున్న‌వారు టీడీపీకి చెందిన కీల‌క నాయ‌కుడేన‌ని గుర్తించిన‌ట్టు స‌మాచారం. పంచాయ‌తీ చాంబ‌ర్ అధ్య‌క్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ కనుస‌న్న‌ల్లోనే ఇదంతా జ‌రుగుతోంద‌ని గుర్తించార‌ట‌. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on November 23, 2022 9:43 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

31 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago