రాష్ట్రంలో సర్పంచులు తీవ్ర ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి మద్దతు దారులుగా ఉండి.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సర్పంచులు.. ఇప్పుడు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు న్యాయం చేయడంలేదని, తమ చేతిలో చిల్లిగవ్వకూడా ఉండడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తు్న్నారు. నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం మరింత జోరు పెరిగింది.
చాలా మంది సర్పంచులు నేరుగా సీఎం జగన్పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఆందోళనలను కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇక, ఏకంగా కడప, అనంతపురం జిల్లాల్లో అయితే జగన్ బొమ్మ ముందు పెట్టుకుని మరీ సర్పంచులు దీక్షలు చేస్తున్నారు. జగన్ వల్లే తాము నష్టపోయాయమని, ఆయనను నమ్ముకుని ఇబ్బందులు పడుతున్నామని, తమ నిధులు ప్రభుత్వం తీసుకుందని.. తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. ఇలా జరుగుతున్న ఈ ఉద్యమాలపై.. తాజాగా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికలకు ముందు ఇలా ఎందుకు జరుగుతోందనే విషయంపై సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొందరు కీలక నేతలను రప్పించుకుని వారితో ఈ విషయంపై చర్చించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడైనా వ్యతిరేతకత రావొచ్చు కానీ, గ్రామీణ స్థాయిలో వస్తే ఇబ్బందే.
ఈ నేపథ్యంలోనే జగన్ కీలకమైన సమాచారం తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు తెలిసింది ఏంటంటే సర్పంచులకు వెనుకాల ఉండి.. వారిని ప్రోత్సహించి మరీ ఉద్యమాల బాటపట్టిస్తున్నవారు టీడీపీకి చెందిన కీలక నాయకుడేనని గుర్తించినట్టు సమాచారం. పంచాయతీ చాంబర్ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని గుర్తించారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 23, 2022 9:43 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…