రాష్ట్రంలో సర్పంచులు తీవ్ర ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి మద్దతు దారులుగా ఉండి.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సర్పంచులు.. ఇప్పుడు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు న్యాయం చేయడంలేదని, తమ చేతిలో చిల్లిగవ్వకూడా ఉండడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తు్న్నారు. నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం మరింత జోరు పెరిగింది.
చాలా మంది సర్పంచులు నేరుగా సీఎం జగన్పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఆందోళనలను కూడా ముమ్మరం చేస్తున్నారు. ఇక, ఏకంగా కడప, అనంతపురం జిల్లాల్లో అయితే జగన్ బొమ్మ ముందు పెట్టుకుని మరీ సర్పంచులు దీక్షలు చేస్తున్నారు. జగన్ వల్లే తాము నష్టపోయాయమని, ఆయనను నమ్ముకుని ఇబ్బందులు పడుతున్నామని, తమ నిధులు ప్రభుత్వం తీసుకుందని.. తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే.. ఇలా జరుగుతున్న ఈ ఉద్యమాలపై.. తాజాగా వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికలకు ముందు ఇలా ఎందుకు జరుగుతోందనే విషయంపై సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కొందరు కీలక నేతలను రప్పించుకుని వారితో ఈ విషయంపై చర్చించినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడైనా వ్యతిరేతకత రావొచ్చు కానీ, గ్రామీణ స్థాయిలో వస్తే ఇబ్బందే.
ఈ నేపథ్యంలోనే జగన్ కీలకమైన సమాచారం తెప్పించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయనకు తెలిసింది ఏంటంటే సర్పంచులకు వెనుకాల ఉండి.. వారిని ప్రోత్సహించి మరీ ఉద్యమాల బాటపట్టిస్తున్నవారు టీడీపీకి చెందిన కీలక నాయకుడేనని గుర్తించినట్టు సమాచారం. పంచాయతీ చాంబర్ అధ్యక్షుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని గుర్తించారట. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on November 23, 2022 9:43 pm
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…
గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…