Movie News

మళ్ళీ అదే ‘ఫోటో’ నా ?

కొన్ని సినిమాలను ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోలేరు. గుండెల్ని పిండేసి ఏడిపించే సినిమాలను మర్చిపోవడం జరగని పని. తాజాగా ఓ సినిమా టీజర్ ప్రేక్షకులను మెప్పించి ఓటీటీలో సూపర్ హిట్ అనిపించుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీని గుర్తుచేస్తోంది. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య జంటగా సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ కి సంబంధించి టీజర్ రిలీజైంది. ఒక ఈవెంట్ ఏర్పాటు చేసి స్టార్ డైరెక్టర్స్ చేత టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ బాగుందనే కాంప్లిమెంట్ అందుకుంటున్నప్పటికీ, కథలో మాత్రం కొత్తదనం ఏం లేదనిపిస్తోంది. ముఖ్యంగా ఈ మధ్యే ఇదే కథతో వచ్చిన ‘కలర్ ఫోటో’ ను ఈ టీజర్ గుర్తుచేసింది. సుహాస్ , చాందిని చౌదరి జంటగా వచ్చిన ‘కలర్ ఫోటో’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను మెప్పించి ఆహకి అమాంతంగా సబ్ స్క్రిప్షన్స్ పెంచేసింది. పైగా ఇటివలే నేషనల్ అవార్డు కూడా దక్కింది. అందులో నల్లగా ఉండే ఓ పేద కుర్రాడు అందమైన డబ్బున్న అమ్మాయితో సాగించే ప్రేమాయణం మెజారిటీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది.

ఇప్పుడు బేబీ కూడా ఇంచుమించు అదే కథతో వస్తుందా ? అనే అనుమానం ప్రేక్షకుల్లో కలుగుతుంది. పైగా రెండిటికి సాయి రాజేష్ రైటర్ కావడంతో ఈ పోలికకు ఎక్కువ స్కోప్ దొరింది. కలర్ ఫోటోలో హీరో నల్లగా ఉంటే, బేబీ లో హీరోయిన్ నల్లగా కనిపిస్తుంది. పైగా బేబీ క్లైమాక్స్ కూడా సాడ్ ఎండింగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరి ఇవన్నీ చూస్తే మళ్ళీ అదే ఫోటోను తిప్పి చూపించనున్నారా ? అనే సందేహం వస్తుంది. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులే ఈ కథకి మార్కులేస్తారు కాబట్టి అంత వరకూ కలర్ ఫోటో నే అచ్చం దింపేశారని చెప్పలేం.

This post was last modified on November 22, 2022 10:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

24 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

30 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago