భాగ్యశ్రీ.. నిన్నటి తరం భారతీయ సినీ ప్రేక్షకులు ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. ఒకే ఒక్క సినిమాతో ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ చిత్రమే.. మైనే ప్యార్ కియా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రాధేశ్యామ్లో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం. హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్తో సినిమా అనే సరికి తల్లి పాత్రకైనా ఆమె రెడీ అనేసినట్లుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంఉటందని.. సినిమాలో ఆమె హైలైట్ అవుతుందని అంటున్నారు. కాగా.. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో మరో బడా స్టార్ హీరోకు తల్లిగా నటించే అవకాశం ఆమె ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో అతను సర్కారు వారి పాట పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన\ సంగతి తెలిసిందే. ఇందులో అతడి తల్లిదండ్రులిద్దరి పాత్రలు కీలకమట. రాధేశ్యామ్లో భాగ్యశ్రీ పెర్ఫామెన్స్ గురించి తెలుసుకున్న పరశురామ్.. ఆమెతో ఈ పాత్ర చేస్తే సినిమాకు ఆకర్షణ అవుతుందని భావించాడట. చర్చలు జరుగుతున్నాయని.. ఆమె ఈ సినిమా ఓకే చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on July 14, 2020 12:27 pm
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…