భాగ్యశ్రీ.. నిన్నటి తరం భారతీయ సినీ ప్రేక్షకులు ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. ఒకే ఒక్క సినిమాతో ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ చిత్రమే.. మైనే ప్యార్ కియా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రాధేశ్యామ్లో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం. హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్తో సినిమా అనే సరికి తల్లి పాత్రకైనా ఆమె రెడీ అనేసినట్లుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంఉటందని.. సినిమాలో ఆమె హైలైట్ అవుతుందని అంటున్నారు. కాగా.. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో మరో బడా స్టార్ హీరోకు తల్లిగా నటించే అవకాశం ఆమె ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో అతను సర్కారు వారి పాట పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన\ సంగతి తెలిసిందే. ఇందులో అతడి తల్లిదండ్రులిద్దరి పాత్రలు కీలకమట. రాధేశ్యామ్లో భాగ్యశ్రీ పెర్ఫామెన్స్ గురించి తెలుసుకున్న పరశురామ్.. ఆమెతో ఈ పాత్ర చేస్తే సినిమాకు ఆకర్షణ అవుతుందని భావించాడట. చర్చలు జరుగుతున్నాయని.. ఆమె ఈ సినిమా ఓకే చేయొచ్చని అంటున్నారు.
టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…
ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…