భాగ్యశ్రీ.. నిన్నటి తరం భారతీయ సినీ ప్రేక్షకులు ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. ఒకే ఒక్క సినిమాతో ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ చిత్రమే.. మైనే ప్యార్ కియా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రాధేశ్యామ్లో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం. హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్తో సినిమా అనే సరికి తల్లి పాత్రకైనా ఆమె రెడీ అనేసినట్లుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంఉటందని.. సినిమాలో ఆమె హైలైట్ అవుతుందని అంటున్నారు. కాగా.. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో మరో బడా స్టార్ హీరోకు తల్లిగా నటించే అవకాశం ఆమె ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో అతను సర్కారు వారి పాట పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన\ సంగతి తెలిసిందే. ఇందులో అతడి తల్లిదండ్రులిద్దరి పాత్రలు కీలకమట. రాధేశ్యామ్లో భాగ్యశ్రీ పెర్ఫామెన్స్ గురించి తెలుసుకున్న పరశురామ్.. ఆమెతో ఈ పాత్ర చేస్తే సినిమాకు ఆకర్షణ అవుతుందని భావించాడట. చర్చలు జరుగుతున్నాయని.. ఆమె ఈ సినిమా ఓకే చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on July 14, 2020 12:27 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…