భాగ్యశ్రీ.. నిన్నటి తరం భారతీయ సినీ ప్రేక్షకులు ఈ పేరును అంత సులువుగా మరిచిపోలేరు. చేసినవి తక్కువ సినిమాలే కానీ.. ఒకే ఒక్క సినిమాతో ఆమె ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆ చిత్రమే.. మైనే ప్యార్ కియా. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది భాగ్యశ్రీ. ఈ సినిమా ప్రేమ పావురాలు పేరుతో తెలుగులో అనువాదమై ఇక్కడా ఘనవిజయం సాధించింది.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సినిమా రాణాలో నటించి మాయమైన భాగ్యశ్రీ.. మళ్లీ ఇటు చూడలేదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రాధేశ్యామ్లో ఆమె అతడికి తల్లి పాత్ర పోషిస్తుండటం విశేషం. హిందీలో కూడా సినిమాలు చేయడం మానేసిన భాగ్యశ్రీ.. ఇప్పుడిలా తెలుగు సినిమాలో నటించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్తో సినిమా అనే సరికి తల్లి పాత్రకైనా ఆమె రెడీ అనేసినట్లుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుంఉటందని.. సినిమాలో ఆమె హైలైట్ అవుతుందని అంటున్నారు. కాగా.. ఈ సినిమా విడుదల కాకముందే తెలుగులో మరో బడా స్టార్ హీరోకు తల్లిగా నటించే అవకాశం ఆమె ముందుకొచ్చినట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు.
పరశురామ్ దర్శకత్వంలో అతను సర్కారు వారి పాట పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన\ సంగతి తెలిసిందే. ఇందులో అతడి తల్లిదండ్రులిద్దరి పాత్రలు కీలకమట. రాధేశ్యామ్లో భాగ్యశ్రీ పెర్ఫామెన్స్ గురించి తెలుసుకున్న పరశురామ్.. ఆమెతో ఈ పాత్ర చేస్తే సినిమాకు ఆకర్షణ అవుతుందని భావించాడట. చర్చలు జరుగుతున్నాయని.. ఆమె ఈ సినిమా ఓకే చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on July 14, 2020 12:27 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…