ముత్తు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటి. ‘బాషా’ కంటే ముందు తెలుగులో రజినీకి మంచి ఫాలోయింగ్ రావడానికి ఈ సినిమా ముఖ్య కారణం. ఐతే ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్టయి.. తెలుగులోనూ బాగా ఆడడం పెద్ద గొప్పేమీ కాదు. తమిళంలో అప్పటికే రజినీ సూపర్ స్టార్. తెలుగులో కూడా పాపులర్. కానీ ఒక భారతీయ సినిమా వేరే దేశంలో రిలీజ్ కావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో జపాన్లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడం.. అది అక్కడి స్ట్రెయిట్ చిత్రాలను మించి వసూళ్ల ప్రభంజనం సాగించడం ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి.
ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో అప్పటికే మంచి పాపులారిటీ తెచ్చుకుని, భారీ వసూళ్లు సాధించాక.. జపాన్లో గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ సోషల్ మీడియా అన్నదే లేని రోజుల్లో, ఒక తమిళ చిత్రాన్ని జపనీస్లో రిలీజ్ చేస్తే ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం.
‘బాహుబలి’కి అంత పబ్లిసిటీ చేసినా.. ఆ సినిమాకు అక్కడ భారీ రిలీజ్, హౌస్ ఫుల్ వసూళ్లు వచ్చినా.. ఫుల్ రన్లో సాధించిన వసూళ్లు 300 మిలియన్ యాన్లు. ఇదేమీ చిన్న నంబర్ కాదు. భారీ వసూళ్లే సాధించినట్లు లెక్క. ఐతే కరెన్సీ విలువ బాగా పడిపోయి, టికెట్ల ధరలు ఎంతో పెరిగిన రోజుల్లోనే ‘బాహుబలి’ ఈ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు తొలి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ 73 మిలియన్ యాన్ల కలెక్షన్లు తెచ్చింది. ఈ ఫిగర్స్ చూసి ఔరా అనుకుంటున్నాం. కానీ పాతికేళ్ల ముందు ‘ముత్తు’ అనే సినిమా జపాన్లో ఏకంగా 400 మిలియన్ యాన్లు కలెక్ట్ చేసిందంటే ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ఒక రాష్ట్రంలో విడుదలైన లోకల్ మూవీ.. జపాన్లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం, సూపర్ స్టార్ రజినీకి కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టడం ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర అనడంలో సందేహం లేదు.
This post was last modified on October 30, 2022 5:48 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…