ముత్తు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటి. ‘బాషా’ కంటే ముందు తెలుగులో రజినీకి మంచి ఫాలోయింగ్ రావడానికి ఈ సినిమా ముఖ్య కారణం. ఐతే ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్టయి.. తెలుగులోనూ బాగా ఆడడం పెద్ద గొప్పేమీ కాదు. తమిళంలో అప్పటికే రజినీ సూపర్ స్టార్. తెలుగులో కూడా పాపులర్. కానీ ఒక భారతీయ సినిమా వేరే దేశంలో రిలీజ్ కావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో జపాన్లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడం.. అది అక్కడి స్ట్రెయిట్ చిత్రాలను మించి వసూళ్ల ప్రభంజనం సాగించడం ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి.
ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో అప్పటికే మంచి పాపులారిటీ తెచ్చుకుని, భారీ వసూళ్లు సాధించాక.. జపాన్లో గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ సోషల్ మీడియా అన్నదే లేని రోజుల్లో, ఒక తమిళ చిత్రాన్ని జపనీస్లో రిలీజ్ చేస్తే ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం.
‘బాహుబలి’కి అంత పబ్లిసిటీ చేసినా.. ఆ సినిమాకు అక్కడ భారీ రిలీజ్, హౌస్ ఫుల్ వసూళ్లు వచ్చినా.. ఫుల్ రన్లో సాధించిన వసూళ్లు 300 మిలియన్ యాన్లు. ఇదేమీ చిన్న నంబర్ కాదు. భారీ వసూళ్లే సాధించినట్లు లెక్క. ఐతే కరెన్సీ విలువ బాగా పడిపోయి, టికెట్ల ధరలు ఎంతో పెరిగిన రోజుల్లోనే ‘బాహుబలి’ ఈ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు తొలి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ 73 మిలియన్ యాన్ల కలెక్షన్లు తెచ్చింది. ఈ ఫిగర్స్ చూసి ఔరా అనుకుంటున్నాం. కానీ పాతికేళ్ల ముందు ‘ముత్తు’ అనే సినిమా జపాన్లో ఏకంగా 400 మిలియన్ యాన్లు కలెక్ట్ చేసిందంటే ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ఒక రాష్ట్రంలో విడుదలైన లోకల్ మూవీ.. జపాన్లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం, సూపర్ స్టార్ రజినీకి కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టడం ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర అనడంలో సందేహం లేదు.
This post was last modified on October 30, 2022 5:48 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…