ముత్తు.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటి. ‘బాషా’ కంటే ముందు తెలుగులో రజినీకి మంచి ఫాలోయింగ్ రావడానికి ఈ సినిమా ముఖ్య కారణం. ఐతే ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్టయి.. తెలుగులోనూ బాగా ఆడడం పెద్ద గొప్పేమీ కాదు. తమిళంలో అప్పటికే రజినీ సూపర్ స్టార్. తెలుగులో కూడా పాపులర్. కానీ ఒక భారతీయ సినిమా వేరే దేశంలో రిలీజ్ కావడమే గొప్పగా చెప్పుకునే రోజుల్లో జపాన్లో ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేయడం.. అది అక్కడి స్ట్రెయిట్ చిత్రాలను మించి వసూళ్ల ప్రభంజనం సాగించడం ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి.
ఇప్పుడు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో అప్పటికే మంచి పాపులారిటీ తెచ్చుకుని, భారీ వసూళ్లు సాధించాక.. జపాన్లో గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు రాబట్టాయి. కానీ సోషల్ మీడియా అన్నదే లేని రోజుల్లో, ఒక తమిళ చిత్రాన్ని జపనీస్లో రిలీజ్ చేస్తే ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించడం అనూహ్యం.
‘బాహుబలి’కి అంత పబ్లిసిటీ చేసినా.. ఆ సినిమాకు అక్కడ భారీ రిలీజ్, హౌస్ ఫుల్ వసూళ్లు వచ్చినా.. ఫుల్ రన్లో సాధించిన వసూళ్లు 300 మిలియన్ యాన్లు. ఇదేమీ చిన్న నంబర్ కాదు. భారీ వసూళ్లే సాధించినట్లు లెక్క. ఐతే కరెన్సీ విలువ బాగా పడిపోయి, టికెట్ల ధరలు ఎంతో పెరిగిన రోజుల్లోనే ‘బాహుబలి’ ఈ వసూళ్లు రాబట్టింది.
ఇప్పుడు తొలి వారంలో ‘ఆర్ఆర్ఆర్’ 73 మిలియన్ యాన్ల కలెక్షన్లు తెచ్చింది. ఈ ఫిగర్స్ చూసి ఔరా అనుకుంటున్నాం. కానీ పాతికేళ్ల ముందు ‘ముత్తు’ అనే సినిమా జపాన్లో ఏకంగా 400 మిలియన్ యాన్లు కలెక్ట్ చేసిందంటే ఆ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలో ఒక రాష్ట్రంలో విడుదలైన లోకల్ మూవీ.. జపాన్లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం, సూపర్ స్టార్ రజినీకి కోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టడం ఎప్పటికీ నిలిచిపోయే చరిత్ర అనడంలో సందేహం లేదు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…