Movie News

57 ఏళ్ల నటుడు.. 24 ఏళ్ల అమ్మాయితో

హాలీవుడ్లో 60-70 ఏళ్ల వయసున్న నటులు.. 20-30 ఏళ్ల అమ్మాయలతో రిలేషన్‌షిప్‌లో ఉండడం.. పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. ఐతే ఇండియన్ సొసైటీలో ఇలాంటివి తక్కువే. కొననేళ్ల ముందు బాలీవుడ్ సీనియర్ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ 56 ఏళ్ల వయసులో.. తనకంటే 30 ఏళ్లు తక్కువ వయసున్న అంకిత కొన్వార్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఇదే బాటలో దక్షిణాది సీనియర్ నటుడు పృథ్వీ ఓ పడుచు అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

‘పెళ్లి’ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి పాపులారిటీ సంపాదించిన పృథ్వీకి ఇప్పుడు 57 ఏళ్లు కావడం గమనార్హం. ఆయన శీతల్ అనే 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్వయంగా వెల్లడించాడు. నిజానికి పృథ్వీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఆయన స్పందించాడు. ఆమెతో ప్రస్తుతానికి రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నానని వెల్లడించాడు.

“నా రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల్ని చూసి చాలామంది నన్ను ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి విషయంలో వస్తున్న వార్తలు నిరాధారం. కానీ నేను శీతల్ అనే అమ్మాయితో రిలేషన్‌‌షిప్‌లో ఉన్న మాట వాస్తవం. ఆమె వయసు 24 ఏళ్లే. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. నా మొదటి భార్య బీనాతో నాకు ఆరేళ్ల నుంచి గొడవలు ఉన్నాయి. దీంతో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసి వేరుగా ఉంటున్నా. ఒంటరితనం మనిషిని కుంగుబాటుకు గురి చేస్తుంది. ఆ బాధను నేను అనుభవించా. అలాంటి సమయంలోనే శీతల్‌తో పరిచయం అయింది. ఆమె ఎంతో పరిణతి చెందిన వ్యక్తి మా అభిరుచులు కలిశాయి. స్నేహితులుగా మారాం. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నాం” అని పృథ్వీ తెలిపాడు.

మరోవైపు శీతల్ మాట్లాడుతూ.. పృథ్వీకి, తనకు మధ్య వయసు అంతరం పెద్ద విషయం కాదని, వయసు ఒక అంకె మాత్రమే అని చెప్పింది. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లందరూ అంగీకరించినట్లు వెల్లడించింది.

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

1 hour ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

3 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

4 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

5 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

5 hours ago