Political News

ఫామ్‌హౌజ్ కేసులో హైకోర్టు తీర్పు ఇదే!

ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఫామ్‌హౌజ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. నిందితులను రిమాండ్ కు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. అంతేకాదు, ఈ కేసులో అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు రిమాండ్‌కు పంప‌డాన్ని తిర‌స్క‌రిస్తూ ఇచ్చిన తీర్పును హైకోర్టు స‌స్పెండ్ చేసింది. వాస్త‌వానికి ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. తొలుత దీనిపై నిందితులు హైద‌రాబాద్ విడిచి వెళ్ల‌రాద‌ని.. అడ్ర‌స్ వివ‌రాల‌ను పోలీసుల‌కు ఇవ్వాల‌ని మాత్ర‌మే హైకోర్టు ఆదేశించింది.

తాజాగా శ‌నివారం కోర్టు ప్రారంభం కాగానే ఈ కేసులో తీర్పు ఇస్తూ.. ఎమ్మెల్యేలకు కోట్లు ఇవ్వ‌జూపిన‌ నిందితులను రిమాండ్‌కు అనుమతినిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, కోరె నందు కుమార్‌ అలియాస్‌ నందు, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిలను.. సైబరాబాద్‌ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం వారిని అరెస్టు చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ధర్మాసనం పేర్కొంది. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించాలని వెల్లడించింది. దీంతో వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మయంలో ఏసీబీ కోర్టులో పోలీసులు హాజ‌రుప‌ర‌చ‌నున్నారు.

ఆద్యంతం ఉత్కంఠ‌

ఈ కేసులో ఆది నుంచి కూడా అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి. రాజ‌కీయంగా కూడా పెనుదుమారం రేగింది. బీజేపీ ఉద్దేశ పూర్వ‌కంగా త‌మ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయాల‌ని భావించింద‌ని, బీజేపీ వ్య‌వ‌హార‌మే ఇంత‌ని టీఆర్ ఎస్ నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు రాగా, అస‌లు మాకు ఆ ఖ‌ర్మే ప‌ట్ట‌లేద‌ని బీజేపీ నేత‌లు వాదించారు. ఈ క్ర‌మంలోనే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ నేరుగా యాదాద్రికి వెళ్లి త‌డిబ‌ట్ట‌ల‌తో ప్ర‌మాణం కూడా చేశారు. ఇక‌, ఈ విష‌యం ఇలా ఉంటే.. మ‌రోవైపు ఆడియో టేపులు లీకై మ‌రింత ర‌చ్చ‌కు దారితీసింది. మొత్తంగా చూస్తే ఈ ప‌రిణామాలు ఎటు దారితీస్తాయో చూడాల‌ని అంటున్నారు పరిశీల‌కులు.

This post was last modified on October 29, 2022 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

45 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago