Movie News

వారసుడి ధైర్యం వెనుక పెద్ద స్కెచ్

సంక్రాంతి వేడి మాములుగా రాజుకోవడం లేదు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ ల పోటీతో బాక్సాఫీస్ వద్ద జరగబోయే రచ్చను ఊహించుకుని ట్రేడ్ ఉక్కిరిబిక్కిరవుతోంది. వీళ్లకు తోడు విజయ్ రావడం కూడా దాదాపు కన్ఫర్మే. దిల్ రాజు నిర్మాత కాబట్టి తెలుగులోనూ పెద్ద రిలీజే ఉంటుంది. అయితే ఆది పురుష్ లాంటి విజువల్ గ్రాండియర్, వాల్తేర్ వీరయ్య – వీరసింహారెడ్డి లాంటి మసాలా ఎంటర్ టైనర్స్ ముందు ఇది తట్టుకుని నిలబడగలదానే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. అయితే ప్రొడక్షన్ హౌస్ తో పాటు నిర్మాణ సంస్థ క్యాలికులేషన్స్ వేరుగా ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.

వాటి ప్రకారం వారసుడు మెయిన్ టార్గెట్ తమిళ మార్కెట్. అక్కడ చిరు బాలయ్య బొమ్మలను పెద్దగా పట్టించుకోరు. సో ఇబ్బంది లేదు. ప్రభాస్ ది యానిమేషన్ టెక్నాలజీ మిక్స్ చేసిన మూవీ కాబట్టి బాహుబలి రేంజ్ లో భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తమిళనాడుతో పాటు ఓవర్సీస్ లో బాగా ఆడితే చాలు విజయ్ ఇమేజ్ కు బ్లాక్ బస్టర్ వసూళ్లు వచ్చేస్తాయి. ఎలాగూ శాటిలైట్ డబ్బింగ్ ఓటిటి భారీ రేటుకు అమ్మేశారు. ఇతర డబ్బింగ్ వెర్షన్ల నుంచి వచ్చేది బోనస్ గా తీసుకోవాలి. ఇవన్నీ లెక్కలు వేసుకునే వారసుడుని పొంగల్ రేస్ లో పెట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారట.

వీటికి తోడు ఆడియో హక్కులకే పది కోట్ల దాకా వచ్చిందనే ప్రచారం కోలీవుడ్ ని ఊపేస్తోంది. తమన్ కెరీర్ లోనే ఇది అత్యధిక మొత్తం. ఒకవేళ అజిత్ తునివు కూడా వస్తేనే ఈ వారసుడికి చిక్కులు తప్ప ఇంక దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. పండగ టైంలో స్క్రీన్ల ఇష్యూ పెద్ద ఎత్తున వచ్చేలా ఉంది. ఏపీ తెలంగాణలో ఒకేసారి ఇన్నేసి పెద్ద సినిమాలకు సర్దుబాటు చేసేంత నెంబర్ ప్రస్తుతం లేదు. ఒకవేళ దిల్ రాజు కనక నో కాంప్రోమైజ్ అంటూ వారసుడుని భారీ ఎత్తున దించితే మాత్రం ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏం చేశాడో చూడాలి.

This post was last modified on October 24, 2022 10:23 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

45 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago