అల్లు శిరీష్ హీరోగా రాకేశ్ దర్శకత్వంలో ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమా వస్తుంది. ముందుగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చుకున్నారు. నవంబర్ 4న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాకు శిరీష్ రంగంలో దిగి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూలు , టూర్లు ఫినిష్ చేశాడు. ఇక మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే. దాని కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారంలో హైదరాబాద్ లో ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణను గెస్ట్ గా పిలిచే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ బాలయ్య తో ఓ మాట అనేసి సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య కి అల్లు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుంది. అల్లు అరవింద్ ‘ఆహా’లో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నాడు. బాలయ్య ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇటు నుండి అటు అటు నుండి ఇటు రాకపోకలు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు శిరీష్ కోసం బాలయ్య గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
అఖండ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ కోసం ఇప్పుడు బాలయ్య ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ కి గెస్ట్ అవ్వనున్నాడట. ప్రస్తుతం బాలయ్య ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో డీటెయిల్స్ బయట పెట్టి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి అల్లు శిరీష్ గురించి బాలయ్య ఈవెంట్ లో ఏం మాట్లాడతారో అల్లు కుటుంబం గురించి ఇంకా ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 23, 2022 3:14 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…