అల్లు శిరీష్ హీరోగా రాకేశ్ దర్శకత్వంలో ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమా వస్తుంది. ముందుగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చుకున్నారు. నవంబర్ 4న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాకు శిరీష్ రంగంలో దిగి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూలు , టూర్లు ఫినిష్ చేశాడు. ఇక మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే. దాని కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారంలో హైదరాబాద్ లో ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణను గెస్ట్ గా పిలిచే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ బాలయ్య తో ఓ మాట అనేసి సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య కి అల్లు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుంది. అల్లు అరవింద్ ‘ఆహా’లో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నాడు. బాలయ్య ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇటు నుండి అటు అటు నుండి ఇటు రాకపోకలు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు శిరీష్ కోసం బాలయ్య గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
అఖండ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ కోసం ఇప్పుడు బాలయ్య ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ కి గెస్ట్ అవ్వనున్నాడట. ప్రస్తుతం బాలయ్య ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో డీటెయిల్స్ బయట పెట్టి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి అల్లు శిరీష్ గురించి బాలయ్య ఈవెంట్ లో ఏం మాట్లాడతారో అల్లు కుటుంబం గురించి ఇంకా ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…