అల్లు శిరీష్ హీరోగా రాకేశ్ దర్శకత్వంలో ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమా వస్తుంది. ముందుగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చుకున్నారు. నవంబర్ 4న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాకు శిరీష్ రంగంలో దిగి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూలు , టూర్లు ఫినిష్ చేశాడు. ఇక మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే. దాని కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారంలో హైదరాబాద్ లో ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణను గెస్ట్ గా పిలిచే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ బాలయ్య తో ఓ మాట అనేసి సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య కి అల్లు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుంది. అల్లు అరవింద్ ‘ఆహా’లో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నాడు. బాలయ్య ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇటు నుండి అటు అటు నుండి ఇటు రాకపోకలు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు శిరీష్ కోసం బాలయ్య గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
అఖండ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ కోసం ఇప్పుడు బాలయ్య ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ కి గెస్ట్ అవ్వనున్నాడట. ప్రస్తుతం బాలయ్య ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో డీటెయిల్స్ బయట పెట్టి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి అల్లు శిరీష్ గురించి బాలయ్య ఈవెంట్ లో ఏం మాట్లాడతారో అల్లు కుటుంబం గురించి ఇంకా ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 23, 2022 3:14 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…