అల్లు శిరీష్ హీరోగా రాకేశ్ దర్శకత్వంలో ‘ఊర్వసివో రాక్షసివో’ అనే సినిమా వస్తుంది. ముందుగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు టైటిల్ మార్చుకున్నారు. నవంబర్ 4న రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాకు శిరీష్ రంగంలో దిగి ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటర్వ్యూలు , టూర్లు ఫినిష్ చేశాడు. ఇక మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటే. దాని కోసమే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారంలో హైదరాబాద్ లో ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణను గెస్ట్ గా పిలిచే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పటికే అల్లు అరవింద్ బాలయ్య తో ఓ మాట అనేసి సిగ్నల్ అందుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య కి అల్లు కుటుంబానికి మధ్య మంచి అనుబంధం కొనసాగుతుంది. అల్లు అరవింద్ ‘ఆహా’లో బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో చేస్తున్నాడు. బాలయ్య ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా విచ్చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇటు నుండి అటు అటు నుండి ఇటు రాకపోకలు మొదలయ్యాయి. అందుకే ఇప్పుడు శిరీష్ కోసం బాలయ్య గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం.
అఖండ ఈవెంట్ కి వచ్చిన అల్లు అర్జున్ కోసం ఇప్పుడు బాలయ్య ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ కి గెస్ట్ అవ్వనున్నాడట. ప్రస్తుతం బాలయ్య ని దృష్టిలో పెట్టుకొని ఈవెంట్ ను భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో డీటెయిల్స్ బయట పెట్టి ఎనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు. మరి అల్లు శిరీష్ గురించి బాలయ్య ఈవెంట్ లో ఏం మాట్లాడతారో అల్లు కుటుంబం గురించి ఇంకా ఏం చెప్తారో వేచి చూడాల్సిందే.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…