మహేష్ కోసం పంథా మార్చుకుంటాడా ?

మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో మొదటి షెడ్యుల్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ త్వరలోనే మొదలు కానుంది. తాజాగా మహేష్ అమ్మ ఇందిరా దేవి మరణంతో సెకండ్ షెడ్యుల్ కి బ్రేక్ పడింది. దీంతో ఆ షెడ్యుల్ ప్లానింగ్ మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టనున్నాడనేది ఆ న్యూస్.

లేటెస్ట్ గా ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ స్పందించాడు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మహేష్ గారి ఫ్యాన్స్ , మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇంకా డిసిషన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ – త్రివిక్రమ్ గార్ల కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ రెండూ థియేటర్స్ లో అనుకున్నంత ఆదరణ అందుకోలేకపోయాయి. ఆ సినిమాలు టివీ లో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయి. కానీ ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించి సినిమా ఉండబోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు నాగ వంశీ.

బేసిక్ గా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు. కానీ ఆ స్పెషల్ పబ్ సాంగ్ పెడుతుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన సినిమాలో మరో కమర్షియల్ ఎలిమెంట్ ఫిక్స్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. మరి మహేష్ కోసం త్రివిక్రమ్ తన పంథా మార్చుకొని సుకుమార్ లా ఐటెం సాంగ్ తో హంగామా చేస్తాడేమో చూడాలి.