Movie News

ప్రభాస్‌తో సంజయ్ దత్?


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు చిత్రాలు సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయినా అతడి ఊపేమీ తగ్గలేదు. ఆదిపురుష్, ప్రాజెక్ట్-కే, సలార్ లాంటి భారీ చిత్రాలను లైన్లో పెట్టిన యంగ్ రెబల్ స్టార్.. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే హార్రర్ కామెడీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

పక్కా కమర్షియల్ లాంటి డిజాస్టర్ తీసిన మారుతితో సినిమా వద్దని ప్రభాస్‌ను అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఎంతగా వేడుకున్నా.. మారుతిని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేసినా.. ఈ ప్రాజెక్టు ఆగలేదు. కొన్ని వారాల కిందటే చడీచప్పుడు లేకుండా ఈ సినిమా ముహూర్త కార్యక్రమం పూర్తి చేసుకుంది. ప్రభాస్ వీలును బట్టి రాబోయే రోజుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టును పక్కాగా తీర్చుదిద్దుకోవడంతో పాటు ప్రి ప్రొడక్షన్ పనుల మీద దృష్టిసారించాడు మారుతి.

గత కొన్ని రోజుల నుంచి సినిమాలో ముఖ్య పాత్రలకు నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్లే వివిధ భాషల నటీనటులను ఎంచుకున్నట్లు సమాచారం. ఇందులో విలన్ పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ పేరును పరిశీలిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే బాహుబలిలో కట్టప్పగా ప్రభాస్ కలయికలో గొప్ప పాత్ర చేసిన తమిళ నటుడు సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో నటించనున్నాడట.

మారుతి గత రెండు చిత్రాలు పక్కా కమర్షియల్, ప్రతి రోజూ పండగేల్లోనూ ఆయన కీలక పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త సినిమాలో ప్రభాస్ తాతగా సత్యరాజ్ నటించనున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో ఒక కథానాయికగా మాళవిక మోహనన్ ఖరారైనట్లు ఇంతకుముందే వార్తలొచ్చాయి. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సలార్, ప్రాజెక్ట్-కే చిత్రాల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ కొన్ని డేట్లను ప్రభాస్ ఈ సినిమా కోసం కేటాయించనున్నాడు.

This post was last modified on September 28, 2022 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా?’

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా…

4 minutes ago

అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క…

2 hours ago

చాక్లెట్ లుక్‌లో కియారా… సోషల్ మీడియా షేక్

​బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పెళ్లి, ఆ తర్వాత పాప…

2 hours ago

దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి…

2 hours ago

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు…

3 hours ago

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…

4 hours ago