బజ్ ఏ స్థాయిలో ఉందన్నది కాసేపు పక్కనపెడితే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కు సంబంధించి బయటికి చెప్పని ఎనో విశేషాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. యాంకర్ శ్రీముఖికి ప్రైవేట్ జెట్ లో విమానంలో ప్రయాణం చేస్తూ ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పకొచ్చారు చిరు. ఆల్రెడీ పూరి జగన్నాధ్ ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కీలకమైన పాయింట్ ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ లో యుట్యూబర్ పాత్రనే ఇందులో మన ఆడియన్స్ కి తగ్గట్టుగా కొంత మార్చారట. ముందు భయపడినా తర్వాత చాలా బాగా చేశాడని కితాబు ఇచ్చారు.
ఇక అసలు విషయానికి వస్తే గాడ్ ఫాదర్ సినిమా రాష్ట్ర సిఎం చనిపోవడంతో మొదలవుతుంది. లీడర్, భరత్ అనే నేను ఫ్లేవర్ లో అనిపించినా దీని ప్యాట్రన్ వేరే. ఆ ముఖ్యమంత్రిగా చేసింది సర్వదమన్ బెనర్జీ. నిన్నటి తరం యూత్ కి ఇతను గుర్తే కానీ ఇప్పటి జెనరేషన్ కు మాత్రం కొంత విడమరిచి చెప్పాలి. 1986లో కళాతపస్వి కె విశ్వనాథ్ ఆవిష్కరించిన అద్భుతం సిరివెన్నెలలో అంధుడిగా పరిచయమయ్యింది ఇతనే. సుహాసిని లాంటి సీనియర్ తో పోటీ పడి ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోసిన తీరు ఎన్నో అవార్డులను తీసుకొచ్చింది. ఈ గాలి ఈ నెల పాట వినిపిస్తే చాలు మెదిలేది ఈయన రూపమే.
తర్వాత 1987లో అదే విశ్వనాథుల డైరెక్షన్ లో స్వయంకృషి చేశారు. సుమలత భర్తగా కనిపించేది ఎక్కువ కాకపోయినా మంచి గుర్తింపు వచ్చింది. కట్ చేస్తే కృష్ణ, ఓం నమః శివాయ లాంటి టీవీ సీరియల్స్ లో నటించడం తప్ప వెండితెరకు దూరమయ్యాడు. ముప్పై అయిదు సంవత్సరాల తర్వాత తిరిగి గాడ్ ఫాదర్ తోనే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అంటే హీరోకు తండ్రన్న మాట. సర్వదమన్ భార్యల సవతి బిడ్డలుగా చిరంజీవి, నయనతార కనిపిస్తారు. మెగాస్టార్ కు తన సమకాలీకుల్లో చంద్రమోహన్ ఇద్దరు మిత్రుల్లో ఫాదర్ గా కనిపిస్తే ఇప్పుడీ బెనర్జీ అదే సీన్ రిపీట్ చేస్తున్నారు.
This post was last modified on September 26, 2022 7:13 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…