ఈ హెడ్డింగ్ చూసి ఏదో ఊహించుకోకండి. ఇదేదో మందుకొట్టే వ్యవహారం గురించిన ప్రశ్న కాదు. ఆమె సొగసు గురించి అందరూ ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్న ఇది. ఎంత అందమైన హీరోయిన్లయినా థర్టీస్లోకి రాగానే కొంతమేర ఆకర్షణ కోల్పోతుంటారు. ఇక ఫార్టీస్లోకి వచ్చారంటే అంతే సంగతులు. ఆ వయసు వాళ్లను అసలు హీరోయిన్లుగా పరిగణించరు. అందం, ఆకర్షణ తగ్గిపోయి లుక్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ త్రిష మాత్రం 40 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
అలా అని ఎప్పుడూ ఆమె అంతే ఆకర్షణీయంగా ఉందనుకుంటే పొరబాటే. కొన్నేళ్ల ముందు ఆమెను చూసి ఇక తన పనైపోయిందని అంతా అనుకున్నారు. ముఖంలో గ్లో తగ్గిపోయింది. తన సినిమాలు కూడా వరుసగా బోల్తా కొట్టాయి. తన స్థాయికి తగని సినిమాలతో త్రిష అభిమానులను నిరాశ పరిచింది. అదే సమయంలో పెళ్లికి కూడా సిద్ధం కావడంతో ఆమె కథ ముగిసిందనే నిర్ణయానికి వచ్చేశారు.
ఐతే వరుణ్ మణియన్తో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని.. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న త్రిష.. ఆ గ్యాప్ తర్వాత మళ్లీ జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి భారీ చిత్రంలో అవకాశం దక్కింది. ఇందులో ముఖ్య పాత్ర కోసం ఏం కసరత్తులు చేసిందో ఏమో కానీ.. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లలో తనను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వివిధ నగరాల్లో తిరుగుతున్న త్రిషను చూసి ఫిదా అయిపోతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో త్రిష లుక్, తన అప్పీయరెన్స్ చూసి మెస్మరైజ్ కాని వాళ్లు లేరు. వయసు పెరుగుతుంటే ముందుకంటే ఇంకా అందంగా తయారవడం త్రిషకే చెల్లిందని.. ఆమె అమృతం లాంటిదేమైనా తాగుతోందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో మీడియాతో, అభిమానులతో త్రిష మాట్లాడిన తీరు పట్ల కూడా ప్రశంసలు కురిశాయి.
This post was last modified on September 26, 2022 3:03 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…