ఈ హెడ్డింగ్ చూసి ఏదో ఊహించుకోకండి. ఇదేదో మందుకొట్టే వ్యవహారం గురించిన ప్రశ్న కాదు. ఆమె సొగసు గురించి అందరూ ఆశ్చర్యపోతూ సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్న ఇది. ఎంత అందమైన హీరోయిన్లయినా థర్టీస్లోకి రాగానే కొంతమేర ఆకర్షణ కోల్పోతుంటారు. ఇక ఫార్టీస్లోకి వచ్చారంటే అంతే సంగతులు. ఆ వయసు వాళ్లను అసలు హీరోయిన్లుగా పరిగణించరు. అందం, ఆకర్షణ తగ్గిపోయి లుక్ తేడా కొట్టేస్తుంటుంది. కానీ త్రిష మాత్రం 40 ఏళ్ల వయసులో మెరిసిపోతున్న తీరుకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
అలా అని ఎప్పుడూ ఆమె అంతే ఆకర్షణీయంగా ఉందనుకుంటే పొరబాటే. కొన్నేళ్ల ముందు ఆమెను చూసి ఇక తన పనైపోయిందని అంతా అనుకున్నారు. ముఖంలో గ్లో తగ్గిపోయింది. తన సినిమాలు కూడా వరుసగా బోల్తా కొట్టాయి. తన స్థాయికి తగని సినిమాలతో త్రిష అభిమానులను నిరాశ పరిచింది. అదే సమయంలో పెళ్లికి కూడా సిద్ధం కావడంతో ఆమె కథ ముగిసిందనే నిర్ణయానికి వచ్చేశారు.
ఐతే వరుణ్ మణియన్తో చేసుకున్న నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని.. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న త్రిష.. ఆ గ్యాప్ తర్వాత మళ్లీ జాగ్రత్తగా సినిమాలు ఎంచుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమెకు ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి భారీ చిత్రంలో అవకాశం దక్కింది. ఇందులో ముఖ్య పాత్ర కోసం ఏం కసరత్తులు చేసిందో ఏమో కానీ.. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లలో తనను చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వివిధ నగరాల్లో తిరుగుతున్న త్రిషను చూసి ఫిదా అయిపోతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో త్రిష లుక్, తన అప్పీయరెన్స్ చూసి మెస్మరైజ్ కాని వాళ్లు లేరు. వయసు పెరుగుతుంటే ముందుకంటే ఇంకా అందంగా తయారవడం త్రిషకే చెల్లిందని.. ఆమె అమృతం లాంటిదేమైనా తాగుతోందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో మీడియాతో, అభిమానులతో త్రిష మాట్లాడిన తీరు పట్ల కూడా ప్రశంసలు కురిశాయి.
This post was last modified on September 26, 2022 3:03 pm
దేశ భద్రతపై మళ్లీ శాంతిభంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…