కరోనా మహమ్మారి పుణ్యమా అని సినిమా రంగం పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంది. కరోనా ప్రభావం తగ్గినా.. దాని తాలూకు ప్రతికూల ప్రభావం.. ఆ తర్వాత కూడా కొనసాగింది. ఒక దశలో జనాలు థియేటర్లకు రావడం బాగా తగ్గించేశారు. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రాని పరిస్థితి తలెత్తింది. ఇక చిన్న సినిమాలకైతే మెయింటైనెన్స్ ఖర్చులు కూడా రావడం గగనమైంది. ఆ దశలో ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయిపోయింది.
కానీ గత నెలలో బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలు మళ్లీ చిత్ర పరిశ్రమకు ఊపిరి పోశాయి. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మామూలే అన్నట్లు తయారైంది. గత నెల రోజుల్లో పూర్తి సంతృప్తినిచ్చి, బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నందుకున్న సినిమా ఏదీ లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో అల్లూరి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మారిన పరిస్థితుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
“కరోనా తర్వాత సినిమాల గురించి అందరూ చాలా మాట్లాడుతున్నారు. చిన్న సినిమాలు వర్కవుట్ అవుతున్నాయి. చిన్న సినిమాలూ ఫెయిలవుతున్నాయి. పెద్ద సినిమాలు వర్కవుటవుతున్నాయి. పెద్దవీ ఫెయిలవుతున్నాయి. పెద్ద సినిమాలే వర్కవుటవుతాయి. చిన్నవి వర్కవుట్ కావు అనే ఫార్ములా ఏమీ లేదు. ఇప్పుడున్న ట్రెండ్ ఒకటే. పెద్ద సినిమా కాదు.. చిన్న సినిమా కాదు.. మంచి సినిమా. మంచి సినిమా ఉంటే జనాలు ఆదరిస్తున్నారు. సినిమా చిన్నదా పెద్దదా అని చూడట్లేదు. నిజానికి మనం మంచి ట్రెండ్లో ఉన్నాం. ఎవరూ ఏమీ భయపడాల్సిన పని లేదు. సినిమాలో కంటెంట్ ఉంటే చిన్నదా పెద్దదా అనే ఫరక్ పడదు. జనాలు అద్భుతంగా థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇందుకు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని బన్నీ చెప్పాడు. ప్రస్తుత ట్రెండ్ను బన్నీ చాలా బాగా అర్థం చేసుకుని ఇండస్ట్రీకి భరోసానిచ్చే మాటలు చెప్పాడన్నది వాస్తవం.
This post was last modified on September 19, 2022 12:18 pm
మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…