2010లో ఆవారా, నా పేరు శివ వరస హిట్లతో తెలుగులోనూ మార్కెట్ స్థిరపరుచుకున్న కార్తీకి అప్పటి నుంచి రెండు భాషల్లో ఒకేసారి రిలీజులు ఉంటున్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా ఇలా జరిగేలా హక్కులు ఇవ్వడం ద్వారా నిర్మాతలు అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో నేటివిటీ సమస్య వల్ల మద్రాస్ లాంటివి మిస్ అయ్యాయి కానీ దాదాపు అన్నీ ఒకే టైంలో వచ్చేలా కార్తీ జాగ్రత్త పడ్డాడు. కానీ ఇటీవలే రిలీజైన విరుమన్ కు మాత్రం అది సాధ్యపడలేదు. ఆ సమయంలో కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం విడుదలతో పాటు సీతారామం, బింబిసారలు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల కుదరలేదు.
అక్కడ కమర్షియల్ గా విరుమాన్ బాగానే ఆడింది. రొటీన్ విలేజ్ డ్రామానే అయినప్పటికీ బిసి సెంటర్స్ జనం ఆదరించారు. తెలుగులో అయితే ఆ స్థాయి ఫలితం దక్కేది కాదేమో. ఇలా ఎదురు చూస్తుండగానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఓటిటి వర్గాల టాక్. అఫీషియల్ ప్రకటన రేపో ఎల్లుండో వచ్చేస్తుంది. ముత్తయ్య దర్శకత్వం వహించిన విరుమన్ లో ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, అదితి శంకర్, సూరి తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. రెండు భాషల్లో మార్కెట్ ఉన్న హీరోలు ఇలా ఒక చోట్ల ఆలస్యం చేయడం వల్ల థియేట్రికల్ బిజినెస్ తగ్గడమే కాదు సదరు ఒరిజినల్ వెర్షన్ ని ముందే ఓటిటిలో చూసేయడం వల్లో లేదా రివ్యూలు చదవడం వల్లో హాలు దాకా రాకుండా పోయే ప్రమాదం ఉంది. కార్తీ నుంచి ఇది మిస్ అయినా తన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, సర్దార్ లు బిగ్ స్క్రీన్ మీదే రాబోతున్నాయి. వీటికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, హక్కుల అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయట.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…