2010లో ఆవారా, నా పేరు శివ వరస హిట్లతో తెలుగులోనూ మార్కెట్ స్థిరపరుచుకున్న కార్తీకి అప్పటి నుంచి రెండు భాషల్లో ఒకేసారి రిలీజులు ఉంటున్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా ఇలా జరిగేలా హక్కులు ఇవ్వడం ద్వారా నిర్మాతలు అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. మధ్యలో నేటివిటీ సమస్య వల్ల మద్రాస్ లాంటివి మిస్ అయ్యాయి కానీ దాదాపు అన్నీ ఒకే టైంలో వచ్చేలా కార్తీ జాగ్రత్త పడ్డాడు. కానీ ఇటీవలే రిలీజైన విరుమన్ కు మాత్రం అది సాధ్యపడలేదు. ఆ సమయంలో కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం విడుదలతో పాటు సీతారామం, బింబిసారలు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల కుదరలేదు.
అక్కడ కమర్షియల్ గా విరుమాన్ బాగానే ఆడింది. రొటీన్ విలేజ్ డ్రామానే అయినప్పటికీ బిసి సెంటర్స్ జనం ఆదరించారు. తెలుగులో అయితే ఆ స్థాయి ఫలితం దక్కేది కాదేమో. ఇలా ఎదురు చూస్తుండగానే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఓటిటి వర్గాల టాక్. అఫీషియల్ ప్రకటన రేపో ఎల్లుండో వచ్చేస్తుంది. ముత్తయ్య దర్శకత్వం వహించిన విరుమన్ లో ప్రకాష్ రాజ్, రాజ్ కిరణ్, అదితి శంకర్, సూరి తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.
దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. రెండు భాషల్లో మార్కెట్ ఉన్న హీరోలు ఇలా ఒక చోట్ల ఆలస్యం చేయడం వల్ల థియేట్రికల్ బిజినెస్ తగ్గడమే కాదు సదరు ఒరిజినల్ వెర్షన్ ని ముందే ఓటిటిలో చూసేయడం వల్లో లేదా రివ్యూలు చదవడం వల్లో హాలు దాకా రాకుండా పోయే ప్రమాదం ఉంది. కార్తీ నుంచి ఇది మిస్ అయినా తన టాలీవుడ్ ఫ్యాన్స్ కోసం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, సర్దార్ లు బిగ్ స్క్రీన్ మీదే రాబోతున్నాయి. వీటికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు, హక్కుల అమ్మకాలు దాదాపు పూర్తయ్యాయట.
అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ రాజ్యసభకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నర్సీపట్నం నియోజకవర్గంలో…
భాగ్య నగరిగా పిలుచుకుంటున్న తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. రెండు,…
టాలీవుడ్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇక్కడున్న టాప్ స్టార్లు చాలామందితో ఒకటికి మించి సినిమాలు చేసిందామె. తమిళంలోనూ…
2029 ఎన్నికల్లో వైసీపీ మళ్లీ గెలిచే అవకాశం ఇవ్వబోమని టీడీపీ సీనియర్ నాయకుడు, మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ పార్టీని…
కొత్త సినిమాలకు ప్రమోషన్ తగ్గినా కష్టమే. ప్రచారం మరీ ఎక్కువైనా ప్రమాదమే. వీలైనంత ఎక్కువగా ప్రమోషన్లు చేసి జనం దృష్టి…
టిడిపిలో భారీ జోష్ కనిపించింది. ముఖ్యంగా 33% సీట్లను, పదవులను మహిళలకు కేటాయిస్తామని పార్టీ అధినేత అదేవిధంగా సీఎం చంద్రబాబు…