సినిమాలో కంటెంట్ ఉంటే పబ్లిసిటీ పెద్దగా చేయకపోయినా ఆడియెన్సే నెత్తినబెట్టుకుంటారని చెప్పడానికి ధనుష్ తిరు (తమిళంలో తిరుచిత్రాంబలం) మంచి ఉదాహరణగా నిలుస్తోంది. సైలెంట్ గా పెద్ద సౌండ్ లేకుండా వచ్చిన ఈ యూత్ కం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూడో వారంలోకి అడుగు పెట్టకుండానే ఒరిజినల్ వెర్షన్ నుంచి 100 కోట్ల గ్రాస్ ని అందుకుని ఆశ్చర్యపరిచింది. తెలుగులో భారీ బిజినెస్ చేయకపోయినా అమ్మిన రేట్లకు మించిన లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తోంది. మొన్న వీకెండ్ లో చాలా చోట్ల మంచి ఆక్యుపెన్సీ నమోదు చేసింది. దీనికంతా కారణం కేవలం మౌత్ టాకే
మరో విశేషం ఏంటంటే ఇది ధనుష్ మొదటి హండ్రెడ్ క్రోర్ మూవీ. గతంలో వడ చెన్నై, కర్ణన్, అసురన్ లాంటివి గొప్ప సక్సెస్ సాధించినా ఆ మార్కును అందుకోలేకపోయాయి.అందుకే ధనుష్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉన్నా విజయ్, అజిత్, మావయ్య రజినీకాంత్ సరసన టైర్ వన్ లీగ్ లోకి చేరలేకపోయాడు. ఇప్పుడిలాంటి తిరులు ఇంకో రెండు మూడు పడితే అదేం పెద్ద విషయం కాదు. ఇటీవలే ది గ్రే మ్యాన్ తో నెట్ ఫ్లిక్స్ ద్వారా హాలీవుడ్ డెబ్యూ చేసిన ధనుష్ కు దాని ఫలితం నిరాశపరిచింది. పాత్రపరంగా కనీస గుర్తింపు దక్కకపోయినా రస్సో బ్రదర్స్ డైరెక్షన్ లో చేసిన సంతృప్తి మిగిలింది.
తిరుకి టాలీవుడ్ లో పబ్లిసిటీ లోపం జరగడానికి కారణం లేకపోలేదు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కు గత రెండు సినిమాలు పెద్దన్న, ఈటి తెలుగులో చేదు అనుభవాలు మిగిల్చాయి. అందుకే తిరు విషయంలో హడావిడి చేయకుండా సింపుల్ గా వదిలేశారు. కనీసం ప్రకాష్ రాజ్, నిత్య మీనన్ లతో స్వంతంగా డబ్బింగ్ చెప్పించే ప్రయత్నాలు కూడా చేయలేదు. అయినా జనం క్షమించి చూశారు. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రోమోలు, ఇంటర్వ్యూలు, మేకింగ్ వీడియోలంటూ ఏదైనా హంగామా చేసుంటే ఖచ్చితంగా రీచ్ పెరిగేది. లైగర్ ఫెయిలైన అవకాశాన్ని వాడుకుని ఉండేది. ఛాన్స్ మిస్ అయినట్టే.
This post was last modified on September 7, 2022 6:41 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…