మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఎంత మంచి మిత్రులో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లిద్దరి మధ్య వ్యాపార పరమైన బంధం కూడా ఉంది. అలాంటి మిత్రులు ఇప్పుడు బాక్సాఫీస్ సమరానికి సిద్ధమవుతుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దసరా కానుకగా వీరి చిత్రాలు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ ముఖాముఖి తలపడబోతున్నాయి. రెండు చిత్రాలకు దసరా రోజైన అక్టోబరు 5నే రిలీజ్ డేట్ ఖరారైంది.
అధికారికంగానే ఈ తేదీని రెండు చిత్రాల మేకర్స్ ప్రకటించారు. గత రెండు దశాబ్దాల్లో చిరు, నాగ్ ఇలా ముఖాముఖి తలపడిందే లేదు. మరి ఈ క్లాష్ ఇద్దరి ఆమోద యోగ్యమేనా.. వారి రిలేషన్ను ఈ పోటీ ఏమైనా దెబ్బ తీస్తుందా అన్న సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ దీన్ని ప్రొఫెషనల్గా తీసుకుని ఇద్దరూ తమ సినిమాల దసరా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇప్పుడో చిన్న సర్దుబాటు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ రెండు చిత్రాలను దసరా కానుకగానే రిలీజ్ చేస్తారట కానీ.. అవి ఒకే తేదీన విడుదల కావట్టేదట. ఈ రెండు చిత్రాల్లో ఒకటి ఒక రోజు ముందుగా అక్టోబరు 4న, లేదా ఒక రోజు ఆలస్యంగా అక్టోబరు 6న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీని వల్ల రెండు చిత్రాల ఓపెనింగ్స్కు ఢోకా లేకుండా చూసుకోవచ్చని.. దసరా సెలవుల సీజన్ కాబట్టి సినిమాలు బాగుంటే రెండూ బాగానే ఆడేందుకు స్కోప్ ఉంటుందని.. దేనికీ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట.
ఈ మేరకు ఇరు చిత్ర బృందాల మధ్య చర్చలు జరుగుతున్నాయని.. వీటిలో ఒక సినిమాకు రిలీజ్ డేట్ మారడం ఖాయమని.. కొన్ని రోజుల్లోనే ఈ మేరకు ప్రకటన వస్తుందని అంటున్నారు. మలయాళ బ్లాక్బస్టర్ ‘లూసిఫర్’కు రీమేక్గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ను తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయగా.. ‘ది ఘోస్ట్’కు ‘గరుడవేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఈ రెండు చిత్రాల ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షిస్తున్నాయి.
This post was last modified on September 6, 2022 6:21 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…