విక్రమ్ సినిమా అంటే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఒకసారైనా చూసేంత మ్యాటర్ ఉంటుందని మూవీ లవర్స్ బలంగా నమ్ముతారు. శంకర్ ఐ కమర్షియల్ రిజల్ట్ ఎంత నిరాశపరిచినా దానికి చియాన్ విక్రమ్ కష్టపడిన తీరు అభిమానులను కదిలించింది. ప్రాణాలను సైతం రిస్క్ లో పెట్టడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతటి స్టార్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద రావడం కన్నా కిక్ ఇచ్చే విషయం ఏముంటుంది. అందుకే కోబ్రా రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు తెలుగులో పెద్ద సౌండ్ లేదు కానీ తమిళనాడులో మాత్రం అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.
ఈ నేపథ్యంలో కోబ్రా ఏదైనా మేజిక్ చేయకపోదాని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు నిరాశపరిచాడు. తన గత రెండు చిత్రాలు డెమోంటీ కాలనీ, అంజలి సిబిఐ చూసినవాళ్లు కోబ్రాలో కూడా అలాంటి కంటెంటే ఉంటుందని ఆశించారు. అయితే విక్రమ్ ని రకరకాల గెటప్పుల్లో చూపించేందుకు తాపత్రయపడిన అజయ్ దానికి తగ్గ కథాకథనాలు సమకూర్చుకోవడంలో తడబడటంతో మూడు గంటల నిడివి ఉన్న ఈ యాక్షన్ కం రివెంజ్ డ్రామా ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ల్యాగ్ విపరీతంగా ఉండటంతో ఫైనల్ గా అసంతృప్తి తప్పలేదు.
దశావతారంలో ఎప్పుడైతే కమల్ హాసన్ పది గెటప్పుల్లో తన విశ్వరూపాన్ని పీక్స్ లో చూపించాడో అప్పటి నుంచి దాన్ని మించిన ఫీట్ ఇంకొకరు చేయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నాటుకుపోయింది. దాన్ని బ్రేక్ చేయాలనే ధృడ సంకల్పంతో విక్రమ్ ఈ కోబ్రాని ట్రై చేసినట్టు ఉంది కానీ మొత్తానికి ఏళ్లతరబడి తను పడిన కష్టానికి తగ్గ ఫలితం తెలుగులో అయితే దక్కేలా లేదు. ఓపెనింగ్స్ కూడా సోసోగానే ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించినప్పటికీ ఆ అంశం ఆడియన్స్ కి సరైన రీతిలో రిజిస్టర్ అవ్వలేదు. దానికి తగ్గట్టు ఆల్బమ్ కూడా సోసోగానే ఉండటంతో మొత్తానికి కోబ్రా కాటు విక్రమ్ ను మళ్ళీ ఎప్పుడు కోలుకునేలా చేస్తుందో.
This post was last modified on August 31, 2022 7:02 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…