కొన్నేళ్ల ముందు వరకు పూరి జగన్నాథ్ మీద ఉన్న పెద్ద కంప్లైంట్.. ఆయన ఒకే రకం సినిమాలు తీస్తున్నాడని. ‘పోకిరి’ సినిమాతో మాఫియా కథల మాయలో పడిపోయిన ఆయన.. ఆ తర్వాత అదే మత్తులో ఉండిపోయి తన కథలన్నింటినీ మాఫియా చుట్టూనే తిప్పాడని.. వాటి నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నాడని విమర్శలు వచ్చాయి. గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్మేన్, ఇద్దరమ్మాయిలతో, లోఫర్, పైసా వసూల్.. ఇలా చాలా సినిమాల్లో మాఫియా నేపథ్యం ఉంటుంది.
చాలా వరకు మాఫియా డానే విలన్గా ఉంటాడు. ఐతే మొదట్లో కొత్తగా అనిపించిన ఈ నేపథ్యం తర్వాత జనాలకు మొహం మొత్తేసింది. దీంతో పూరి ఇంకెన్నాళ్లు ఈ మాఫియా కథలు తీస్తాడు అనే కామెంట్లు వినిపించాయి. దీంతో ఆయన కూడా అప్పుడప్పుడూ రూటు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు ఇంకా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
మాఫియా కథలను పూరి పక్కన పెట్టినపుడు రోగ్, మెహబూబా లాంటి భరించలేని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘లైగర్’ విషయానికి వస్తే.. అందులో అస్సలు మాఫియా టచ్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే పూరి తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి చేసిన సినిమా ఇదని చెప్పొచ్చు. అలా అని ఆయనేమైనా కొత్తగా ట్రై చేశాడా అంటే అదేమీ లేదు. దశాబ్దాలుగా చూస్తున్న రొటీన్ కథనే వండి వార్చాడు.
దీంతో పోలిస్తే ఒకే రకంగా అనిపించినా పూరి ఎప్పుడూ చేసే మాఫియా కథలే ఎంతో బెటర్. కథలు ఒకేలా ఉన్నా.. వేరే రకమైన మలుపులైనా ఉండేవి. వాటిలోనే ఏవో సర్ప్రైజ్ ఎలిమెంట్లు పెట్టేవాడు. కానీ ‘లైగర్’లో చిన్న మెరుపు కూడా ఏదీ కనిపించదు. ఒక్క కొత్త సీన్ కూడా లేదు. దీంతో పూరి మారాల్సిన అవసరం లేదని.. ఆయన ఎప్పుడూ తీసే మాఫియా సినిమాలు చేసినా మేలే అని అభిమానులు ఫీలవుతున్నారు. మరి తర్వాతి చిత్రానికి పూరి ఏ రూట్లో వెళ్తాడో చూడాలి.
This post was last modified on August 29, 2022 6:41 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…