అనిల్ కుమార్ యాదవ్. మాజీ నీటిపారుదలశాఖా మంత్రి. మాట తూటాలు పేల్చే మంత్రిగా ఆయన పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యంకాని విషయాలన్నీ అనిల్ చాలా తక్కువ కాలంలోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా కింద పడిపోయారనే టాక్ వినిపిస్తోంది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏపని అడిగినా.. మనం అధికారంలో లేం… అధికారంలోకి వస్తే చిటికెలో చేసేస్తాననేవారు.
2019లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కేబినెట్ లో కీలకమైన నీటిపారుదల శాఖామంత్రి అయ్యారు. ఇక జిల్లాలో నీటి ప్రాజెక్డ్ లన్నీ పరుగులు పెడతాయనుకున్నారు. అనిల్ కూడా ఇంటా బయటా ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. అయితే.. కళ్లు మూసి కళ్లు తెరిచేలోపే… అనిల్ మూడేళ్ల మంత్రి పదవీ కాలం పూర్తయింది. నెల్లూరు, సంగం బ్యారేజీల్లో మిగిలిన పది శాతం పనులను కూడా ఆయన తన హయాంలో చేయించలేకపోయారు. వరసగా రెండేళ్లు వచ్చిన వరదలకి సోమశిల డ్యాం దెబ్బతింది.
కేంద్ర బృందాలు పలుమార్లు పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేయాలని సూచించినా… దిక్కులేకుండా పోయింది. నగరంలో కాలువకట్టల మీద ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలిస్తామని హామీ ఇచ్చి, తరువాత ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని అర్ధమైపోయిందిట. దీంతో వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించారట. ఇదే విషయాన్ని సీఎం జగన్ కి పదేపదే చెప్పారట.
దీనిపై అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కానీ, ఈ విషయం చర్చకు వచ్చి వైరలైంది. వెంకటగిరి నుంచి అనిల్ పోటీ చేయబోతున్నారని తెలియగానే.. స్థానికేతరలు మాకొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వెల్లువెత్తాయి. దాంతో అనిల్ సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా మా అనిల్ అన్న… మా అనిల్ అన్న… అంటూ ఓ రేంజ్ లో వీరాభిమానం చూపిన వారంతా అనిల్ కి దూరమవుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అనిల్ అందరికీ కాని వాడిగా.. ఆయన దూకుడే ఆయనకు శతృవుగా మారిపోయిందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on August 29, 2022 6:46 pm
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…
ఆంధ్రప్రదేశ్లో ఇంకో వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతుండగా.. మంత్రి అంబటి రాంబాబుపై ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ రిలీజ్ చేసిన…
ఎడిటర్ మోహన్ నిర్మాణ సంస్థ ఎంఎస్ ఆర్ట్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ పని చేస్తున్న రోజులవి. ముప్పై…