గురువారం రోజు లైగర్ సినిమా రిలీజైంది. పూర్తిగా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్లను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా గురించి మరీ ఎక్కువ చేసి చెప్పడం విజయ్ టార్గెట్ అవడానికి కారణమైతే.. కెరీర్లో ఈ దశలో వచ్చిన మంచి అవకాశాన్ని వృథా చేసుకున్నందుకు, ప్రేక్షకుల అంచనాలకు తగ్గ సినిమా తీయనందుకు పూరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇదే సమయంలో మెగా అభిమానులు మాత్రం.. విజయ్, పూరీలను వదిలేసి ఈ చిత్ర నిర్మాత ఛార్మి మీద పడ్డారు. ఆమె వేసిన ఒక పాత ట్వీట్ను పట్టుకుని ఉదయం నుంచి తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు సరిగ్గా అయిందని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్లో ఏముందా అని చూస్తే.. వెటకారంగా నవ్వుతున్నట్లు ఎమోజీలు, చప్పట్లు ఉన్నాయి. మరి అలా వేసిన ట్వీట్కు మెగా అభిమానులు ఇప్పుడు టార్గెట్ చేయడం ఏంటి అని డౌట్ రావచ్చు. అక్కడే ఉంది ట్విస్టు.
ఛార్మి ట్వీట్ పెట్టిన డేట్.. 16 అక్టోబరు 2015. ఆ రోజే రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ రిలీజైంది. ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే. ఛార్మి ఆ సినిమా పేరు ప్రస్తావించలేదు కానీ.. అది డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో వెటకారంగానే అలా ట్వీట్ వేసిందన్నది మెగా అభిమానులు చెబుతున్న భాష్యం. ఆ రోజే ఆ ట్వీట్ మీద విరుచుకుపడ్డారు. ఛార్మి వాళ్లకేమీ బదులివ్వకుండా సైలెంటుగా ఉండిపోయింది.
ఇప్పుడు ఛార్మి నిర్మాణంలో తెరకెక్కిన ‘లైగర్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ట్వీట్ను బయటికి తీశారు అభిమానులు. ఇంకొకరి ఫెయిల్యూర్ను చూసి వెటకారపు నవ్వులు నవ్వావు.. ఇప్పుడు సమ్మగా ఉందా అంటూ ఆమెను తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. ఐతే మెగా అభిమానులు చెబుతున్నట్లు అప్పట్లో ‘బ్రూస్ లీ’ సినిమా మీద ఛార్మి ఎందుకు పంచ్ వేసింది.. దాంతో ఆమెకు ఏం సంబంధం అన్నదే అర్థం కావడం లేదు. కానీ మెగా అభిమానులైతే ఈ రోజు ఆమెకు మామూలుగా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు.
This post was last modified on August 26, 2022 5:22 pm
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…
ప్రభాస్ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…
వైసీపీలో చీలిక ఏర్పడుతోందా? ప్రజల మనోభావాలను విస్మరిస్తున్న వైసీపీ అధినేతపై ఆ పార్టీ నాయకులు గుస్సాగా ఉన్నారా? అంటే ఔననే…