ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఫైనల్ గా ఆగస్ట్ 13న విడుదల కాబోతున్న కార్తికేయ 2 అంచనాలను అమాంతం పెంచేసుకునే పనిలో పడింది. ఫాంటసీ డ్రామాలను జనం ఆదరించే తీరు బింబిసారతో మరోసారి ఋజువు కావడంతో ఇప్పుడీ మూవీ మీద ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కార్తికేయకు కొనసాగింపు కాదు.
పూర్తిగా వేరే కథను ఎంచుకుని హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం లాంటి మార్పులు చాలానే చేశారు.తాజాగా రవితేజతో ట్రైలర్ లాంచ్ జరిగింది. ద్వారకా నగరంలో మాయమైపోయిన శ్రీకృష్ణుడి రహస్యం కోసం సమస్త ప్రపంచం వెతుకుతూ ఉంటుంది. తన తల్లితో పాటు మొక్కు తీర్చుకునేందుకు అక్కడికి వెళ్లిన ఓ డాక్టర్(నిఖిల్)కు ఇది ఛేదించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.
అయితే ఇదంత సులభంగా ఉండదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఈ ప్రమాదాన్ని ఎదురుకునేందుకు తన శక్తికి మించి పోరాడాల్సి వస్తుంది. సముద్రాలు దాటి ఎన్నో గండాలు స్వాగతం పలుకుతాయి. చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే కార్తికేయ 2లోని అసలు కథగా కనిపిస్తోంది.
పాయింట్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. విజువల్స్ తో దర్శకుడు చందూ మొండేటి ఊహించిన దానికన్నా చాలా థ్రిల్స్ ప్లాన్ చేసినట్టుగా ట్రైలర్ తో ఇంప్రెస్స్ చేశారు. గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఇలాంటి థీమ్ తోనే దేవిపుత్రుడు వచ్చింది కానీ దాన్ని మించిన హై ఎండ్ గ్రాఫిక్స్ తో పాటు కంటెంట్ పరంగా తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఇది కనక ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఆగస్ట్ నెల ఖాతాలో మరో సూపర్ సక్సెస్ దక్కినట్టే. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ దీని ద్వారానే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.
This post was last modified on August 7, 2022 6:48 am
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయాన్ని జాతికి…
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…