ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఫైనల్ గా ఆగస్ట్ 13న విడుదల కాబోతున్న కార్తికేయ 2 అంచనాలను అమాంతం పెంచేసుకునే పనిలో పడింది. ఫాంటసీ డ్రామాలను జనం ఆదరించే తీరు బింబిసారతో మరోసారి ఋజువు కావడంతో ఇప్పుడీ మూవీ మీద ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కార్తికేయకు కొనసాగింపు కాదు.
పూర్తిగా వేరే కథను ఎంచుకుని హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం లాంటి మార్పులు చాలానే చేశారు.తాజాగా రవితేజతో ట్రైలర్ లాంచ్ జరిగింది. ద్వారకా నగరంలో మాయమైపోయిన శ్రీకృష్ణుడి రహస్యం కోసం సమస్త ప్రపంచం వెతుకుతూ ఉంటుంది. తన తల్లితో పాటు మొక్కు తీర్చుకునేందుకు అక్కడికి వెళ్లిన ఓ డాక్టర్(నిఖిల్)కు ఇది ఛేదించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.
అయితే ఇదంత సులభంగా ఉండదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఈ ప్రమాదాన్ని ఎదురుకునేందుకు తన శక్తికి మించి పోరాడాల్సి వస్తుంది. సముద్రాలు దాటి ఎన్నో గండాలు స్వాగతం పలుకుతాయి. చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే కార్తికేయ 2లోని అసలు కథగా కనిపిస్తోంది.
పాయింట్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. విజువల్స్ తో దర్శకుడు చందూ మొండేటి ఊహించిన దానికన్నా చాలా థ్రిల్స్ ప్లాన్ చేసినట్టుగా ట్రైలర్ తో ఇంప్రెస్స్ చేశారు. గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఇలాంటి థీమ్ తోనే దేవిపుత్రుడు వచ్చింది కానీ దాన్ని మించిన హై ఎండ్ గ్రాఫిక్స్ తో పాటు కంటెంట్ పరంగా తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఇది కనక ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఆగస్ట్ నెల ఖాతాలో మరో సూపర్ సక్సెస్ దక్కినట్టే. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ దీని ద్వారానే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…