ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఫైనల్ గా ఆగస్ట్ 13న విడుదల కాబోతున్న కార్తికేయ 2 అంచనాలను అమాంతం పెంచేసుకునే పనిలో పడింది. ఫాంటసీ డ్రామాలను జనం ఆదరించే తీరు బింబిసారతో మరోసారి ఋజువు కావడంతో ఇప్పుడీ మూవీ మీద ఆసక్తి పెరుగుతోంది. నిఖిల్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కార్తికేయకు కొనసాగింపు కాదు.
పూర్తిగా వేరే కథను ఎంచుకుని హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం లాంటి మార్పులు చాలానే చేశారు.తాజాగా రవితేజతో ట్రైలర్ లాంచ్ జరిగింది. ద్వారకా నగరంలో మాయమైపోయిన శ్రీకృష్ణుడి రహస్యం కోసం సమస్త ప్రపంచం వెతుకుతూ ఉంటుంది. తన తల్లితో పాటు మొక్కు తీర్చుకునేందుకు అక్కడికి వెళ్లిన ఓ డాక్టర్(నిఖిల్)కు ఇది ఛేదించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది.
అయితే ఇదంత సులభంగా ఉండదు. ప్రజల ప్రాణాలతో ముడిపడిన ఈ ప్రమాదాన్ని ఎదురుకునేందుకు తన శక్తికి మించి పోరాడాల్సి వస్తుంది. సముద్రాలు దాటి ఎన్నో గండాలు స్వాగతం పలుకుతాయి. చివరికి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే కార్తికేయ 2లోని అసలు కథగా కనిపిస్తోంది.
పాయింట్ చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. విజువల్స్ తో దర్శకుడు చందూ మొండేటి ఊహించిన దానికన్నా చాలా థ్రిల్స్ ప్లాన్ చేసినట్టుగా ట్రైలర్ తో ఇంప్రెస్స్ చేశారు. గతంలో విక్టరీ వెంకటేష్ హీరోగా ఇలాంటి థీమ్ తోనే దేవిపుత్రుడు వచ్చింది కానీ దాన్ని మించిన హై ఎండ్ గ్రాఫిక్స్ తో పాటు కంటెంట్ పరంగా తీసుకున్న శ్రద్ధ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తోంది. ఇది కనక ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయితే ఆగస్ట్ నెల ఖాతాలో మరో సూపర్ సక్సెస్ దక్కినట్టే. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ దీని ద్వారానే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు.
This post was last modified on August 7, 2022 6:48 am
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…