ఇప్పుడు నడుస్తున్నది ఓటీటీ టైం. కొత్త సినిమాల థియేట్రికల్ రిలీజ్ గురించి మాట్లాడుకునే రోజులు వెళ్లిపోయాయి. మళ్లీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు. మరో మార్గం లేక చిన్న, మీడియం రేంజి సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్లోకి వచ్చేస్తున్నాయి. తెలుగులో ఈ ట్రెండు ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది.
‘అమృతారామ్’ తర్వాత మరో సినిమా రిలీజవ్వడానికి రెండు నెలలు పట్టింది. సత్యదేవ్ సినిమా ‘47 డేస్’ మూడు రోజుల కిందటే జీ5లో రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే హీరో మరో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహా.. సత్యదేవ్ హీరోగా తెరకెక్కించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ జులై 15 నుంచి నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయబోతున్నట్లు నెల కిందటే ప్రకటించారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
ఫాహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కి మలయాళంలో మంచి విజయం సాధించి, క్లాసిక్గా పేరు తెచ్చుకున్న ‘మహేషింటే ప్రతికారం’ చిత్రానికి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ రీమేక్ కావడం విశేషం. ‘కేరాఫ్ కంచరపాలెం’ లాంటి ఒరిజినల్ మూవీని అందించిన వెంకటేష్ మహా.. రెండో ప్రయత్నంలో ఇలా రీమేక్ను ఎంచుకోవడం విశేషమే. ఐతే అతను ఎంచుకున్న రీమేక్ మాత్రం ప్రత్యేకమైందే. దానికి మహా ఎలాంటి టచ్ ఇచ్చాడు.. సత్యదేవ్ లాంటి మంచి నటుడిని ఎలా ఉపయోగించుకున్నాడు అన్నది ఆసక్తికరం.
‘బాహుబలి’ తర్వాత ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన సినిమా ఇదే కావడం మరో విశేషం. ‘కంచరపాలెం’ నిర్మాత ప్రవీణ పరుచూరి కూడా ఇందులో నిర్మాణ భాగస్వామే. ఇటీవలే నెట్ ఫ్లిక్స్లో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తరహాలోనే ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ కూడా మంచి ఫలితాన్నందుకుంటుందనే అంచనాలున్నాయి.
This post was last modified on July 3, 2020 9:11 am
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…