Movie News

మాధవన్‌పై ఓ రేంజ్ ట్రోలింగ్

విలక్షణ నటుడు మాధవన్ ఈ మధ్య తరచుగా సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోతున్నాడు. ఇటీవల కేన్ ఫిలిం ఫెస్టివల్‌లో తన కొత్త చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ను ప్రమోట్ చేసుకునేందుకు వెళ్లిన మాధవన్.. అక్కడ మోడీ సర్కారుకు మద్దతుగా మాట్లాడడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల ముందు డిజిటల్ మనీని ప్రవేశపెట్టినపుడు అందరూ ఎగతాళి చేశారని.. ఇండియాలో ఇది వర్కవుట్ కాదని అన్నారని.. కానీ ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా దాన్ని వాడుతున్నారని పేర్కొంటూ మోడీ సర్కారుకు మాధవన్ ఎలివేషన్ ఇవ్వడం చాలామందికి నచ్చలేదు. అతడి మీద ‘భక్త్’గా ముద్ర వేసి నెటిజన్లు ట్రోల్ చేశారు. కరోనా టైంలో డిజిటల్ మనీ అనివార్యంగా మారి అందరూ వాడారు తప్ప అందులో మోడీ ప్రభుత్వం క్రెడిట్ ఏమీ లేదని.. డీమానిటైజేషన్ లాంటి వ్యవహారాల్లో మోడీ సర్కారు వైఫల్యం సంగతేంటని మాధవన్‌ను ప్రశ్నించారు.

ఆ వ్యవహారం అంతటితో ముగియగా.. ఇప్పుడు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి ఓ కార్యక్రమంలో మాధవన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు కారణం అయ్యాయి. మార్స్ మీదికి ఉపగ్రహాన్ని పంపడం కోసం రష్యా సహా ప్రపంచ దేశాలు భారీగా ఖర్చు పెట్టాయని 30 సార్లకు పైగా ప్రయత్నించాక కొంతమేర విజయవంతం అయ్యాయని.. అప్పుడు కూడా ఒక స్థాయి ఎత్తుకు మించి ఉపగ్రహాన్ని పంపలేకపోయాయని.. కానీ ఇండియా మాత్రం 2014లో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ ప్రయత్నాల్లోనే మార్స్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందని మాధవన్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం వివరిస్తూ భారత శాస్త్రవేత్తలు పంచాంగాన్ని అనుసరించి ఈ మిషన్ చేపట్టారని.. అందుకే అధునాతన సాంకేతిక ఉన్న ప్రపంచ దేశాల కంటే భారత్ తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో వాళ్లను మించి మిషన్‌ను విజయవంతం చేసిందని మాధవన్ పేర్కొన్నాడు.

ఐతే మాధవన్ మాటలన్నీ చాలా అసత్యాలు ఉన్నాయని.. మోడీ ప్రభుత్వ హయాంలో సాంకేతికంగా కూడా దేశం ముందుకెళ్లిపోయిందని ఎలివేషన్ ఇవ్వడానికి, ఈ క్రమంలో తన ‘రాకెట్రీ’ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి మాధవన్ ప్రయత్నిస్తున్నాడని.. ఇన్నాళ్లూ మంచి ఆలోచనా పరుడిగా కనిపించిన మాధవన్.. ఇప్పుడిలా తయారయ్యాడేంటని నెటిజన్లు అతణ్నితెగ ట్రోల్ చేస్తున్నారు.

This post was last modified on June 25, 2022 2:25 pm

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

42 minutes ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

53 minutes ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

5 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

5 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

6 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

6 hours ago