ఒకప్పుడు రిలీజ్ డేట్ మారుతోంది, సినిమా వాయిదా పడుతోంది అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడిపోయేవాళ్లు సినీ జనాలు. కానీ కొవిడ్ దెబ్బకు మొత్తం కథ మారిపోయింది. ఈ రెండేళ్లలో ఎన్ని సినిమాలు ఎన్నెన్నిసార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్నాయో, వాయిదాల మీద వాయిదాలు పడ్డాయో తెలిసిందే. కాబట్టే ఇప్పుడు ఎవరికీ సినిమాను వాయిదా వేయడం పట్ల పెద్దగా ఫీలింగ్ ఉండట్లేదు. జనాలు కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రిలీజ్ డేట్ మార్చడం, సినిమాను వాయిదా వేయడం మీద తమకు తామే జోక్స్ కూడా వేసుకుంటున్నాయి చిత్ర బృందాలు.
తాజాగా తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ సినిమాకు రిలీజ్ డేట్ మారింది. తమిళ స్టార్ శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ముందు ఆగస్టు 31న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఈ మేరకు ప్రకటన ఇచ్చిన నెల లోపే డేట్ మార్చేశారు.
వినాయక చవితికి కాకుండా దీపావళి కానుకగా ‘ప్రిన్స్’ను విడుదల చేయబోతున్నారు. ఇందుక్కారణం ఆగస్టు 31కి సినిమాను రెడీ చేయలేకపోవడం కావచ్చు లేదా దీపావళికి రిలీజ్ చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని కావచ్చు. ఈ విషయాన్ని చెప్పడానికి ఒక ఫన్నీ వీడియోను రూపొందించింది చిత్ర బృందం. అందులో అనుదీప్, శివ కార్తికేయన్, సత్యరాజ్లతో పాటు హీరోయిన్ మరియా కూడా పాల్గొంది. ఇందులో అనుదీప్, శివ, సత్యరాజ్ ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకున్న తీరు భలే ఫన్నీగా ఉంది.
అనుదీప్ ఎంత టిపికల్గా ఉంటాడో, మాట్లాడతాడో, సినిమాలను మించి బయట ఎలా నవ్విస్తాడో ‘క్యాష్’ సహా కొన్ని ప్రోగ్రామ్స్లో అందరూ చూశారు. ఇందులోనూ అలాగే కామెడీ చేశాడు. మొత్తానికి సినిమా వాయిదా పడ్డ విషయాన్ని భలే ఫన్నీగా చెప్పి కొత్త డేట్ జనాల్లో రిజిస్టర్ అయ్యేలా చేయగలిగింది చిత్ర బృందం. ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
పెద్దికి మూడో వారంలో మళ్ళీ పికప్ ఉంటుందని, కొత్త సీన్లు జోడించారు కాబట్టి మరోసారి మంచి నెంబర్లు చూడొచ్చని ఆశించిన…
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…