సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాన్నాళ్ల తర్వాత కెరీర్లో విరామం లభించింది. ‘ఖలేజా’ టైంలో చాలా గ్యాప్ తీసుకున్న మహేష్.. ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడూ గ్యాప్ తీసుకున్నది లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది కానీ.. స్క్రిప్టు నచ్చక ఆ సినిమాను పక్కన పెట్టేశాడు. దీని స్థానంలో వేరే ప్రాజెక్టు సెట్ చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఈలోపు లాక్డౌన్ వచ్చి బ్రేకేసింది. దీంతో ఆరు నెలలుగా మహేష్ ఖాళీగా ఉన్నాడు. ఈ మధ్యే పరశురామ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ఖరారు చేసినప్పటికీ.. వెంటనే చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశమైతే లేకపోయింది. కరోనా ప్రభావం తగ్గి టాలీవుడ్లో షూటింగ్స్ ఊపందుకున్నాక ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు.
ఐతే ‘సర్కారు వారి పాట’ ప్రి ప్రొడక్షన్ పనులైతే జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ స్టూడియోలో ఒక పెద్ద ఫ్లోర్ను అద్దెకు తీసుకుని అక్కడ కోట్ల ఖర్చుతో బ్యాంకు సెట్టింగ్ వేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ పనులు నడుస్తున్నాయి. మహేష్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇదొకటని అంటున్నారు. ‘సర్కారు వారి పాట’ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, మోసాల నేపథ్యంలో సాగే సినిమా అంటున్నారు. తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో మహేష్ కనిపించనున్నాడట. సినిమాలో బ్యాంకు నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని.. ఇక్కడే పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకోసమే ఈ సెట్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన్, పరశురామ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్లోనూ పాల్గొంటున్నారని.. సినిమా మొదలయ్యే సమయానికే ఆడియో రెడీ అయిపోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.
This post was last modified on June 27, 2020 9:47 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…