Movie News

మహేష్ సినిమా కోసం బ్యాంకును దింపుతున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చాన్నాళ్ల తర్వాత కెరీర్లో విరామం లభించింది. ‘ఖలేజా’ టైంలో చాలా గ్యాప్ తీసుకున్న మహేష్.. ఆ తర్వాత వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడూ గ్యాప్ తీసుకున్నది లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది కానీ.. స్క్రిప్టు నచ్చక ఆ సినిమాను పక్కన పెట్టేశాడు. దీని స్థానంలో వేరే ప్రాజెక్టు సెట్ చేసుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఈలోపు లాక్‌డౌన్ వచ్చి బ్రేకేసింది. దీంతో ఆరు నెలలుగా మహేష్ ఖాళీగా ఉన్నాడు. ఈ మధ్యే పరశురామ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ఖరారు చేసినప్పటికీ.. వెంటనే చిత్రీకరణ మొదలుపెట్టే అవకాశమైతే లేకపోయింది. కరోనా ప్రభావం తగ్గి టాలీవుడ్లో షూటింగ్స్ ఊపందుకున్నాక ఈ చిత్రాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు.

ఐతే ‘సర్కారు వారి పాట’ ప్రి ప్రొడక్షన్ పనులైతే జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం ఓ ప్రముఖ స్టూడియోలో ఒక పెద్ద ఫ్లోర్‌ను అద్దెకు తీసుకుని అక్కడ కోట్ల ఖర్చుతో బ్యాంకు సెట్టింగ్ వేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ పనులు నడుస్తున్నాయి. మహేష్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇదొకటని అంటున్నారు. ‘సర్కారు వారి పాట’ బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, మోసాల నేపథ్యంలో సాగే సినిమా అంటున్నారు. తన తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో మహేష్ కనిపించనున్నాడట. సినిమాలో బ్యాంకు నేపథ్యంలో కీలక సన్నివేశాలు ఉంటాయని.. ఇక్కడే పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని.. అందుకోసమే ఈ సెట్ నిర్మిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు సంగీత దర్శకుడు తమన్‌, పరశురామ్ కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లోనూ పాల్గొంటున్నారని.. సినిమా మొదలయ్యే సమయానికే ఆడియో రెడీ అయిపోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఉమ్మడిగా నిర్మించనున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కథానాయికగా నటించనుంది.

suman

Recent Posts

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

12 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago