దక్షిణాదిన ఎలాంటి పాత్రనైనా పోషించగల టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన రెజీనా.. ఏ పాత్రలోనూ నిరాశపరిచిన దాఖలాలైతే లేవు. ఆమె కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. గత ఏడాది డిజాస్టర్ అయిన సెవన్ అనే తెలుగు సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ అంశం ఉందంటే.. రెజీనా చేసిన విలన్ పాత్రే. ఐతే అలాంటి చిన్న సినిమాలో నెగెటివ్ రోల్ చేయడం పెద్ద విషయం కాదు కానీ.. ఇప్పుడు రెజీనా ఓ స్టార్ హీరో సినిమాలో ఓ సంచలన విలన్ పాత్ర చేసినట్లు సమాచారం. ఆ హీరో విశాల్ కాగా.. సినిమా పేరు చక్ర.
విశాల్ ఇంతకుముందు చేసిన ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు)కు కొనసాగింపులా కనిపిస్తున్న సైబర్ థ్రిల్లర్ చక్ర. ఆనందన్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇందులోనూ విశాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రనే చేస్తుండగా.. హ్యాకింగ్లో ఆరితేరిన విలన్ మొత్తం వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని అందరినీ ఓ ఆటాడించే నేపథ్యంలో కథ నడిచేట్లు కనిపించింది ట్రైలర్ చూస్తే. అభిమన్యుడులో విలన్ అర్జున్ అనే విషయం ముందే వెల్లడైపోయింది. కానీ చక్రలో విలన్ ఎవరన్నది ట్రైలర్లో చూపించలేదు.
ఐతే ఆ పాత్ర చేసింది రెజీనా అని.. లేడీని పెద్ద విలన్గా చూపించడమే ఇందులో ట్విస్టు అని చిత్ర వర్గాల సమాచారం. శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా నటిస్తున్నట్లు ఇంతకముందు వెల్లడైంది కానీ.. ట్రైలర్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. రెజీనా మాత్రం సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటం విశేషం. విలన్ పాత్ర కావడం వల్ల దాన్ని సస్పెన్సుగా పెట్టారని సమాచారం. ఉన్నట్లుండి ట్రైలర్తో హడావుడి చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలొస్తున్నాయి.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…