దక్షిణాదిన ఎలాంటి పాత్రనైనా పోషించగల టాలెంటెడ్ హీరోయిన్లలో రెజీనా కసాండ్రా ఒకరు. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ ఒక స్థాయికి మించి ఎదగలేకపోయిన రెజీనా.. ఏ పాత్రలోనూ నిరాశపరిచిన దాఖలాలైతే లేవు. ఆమె కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. గత ఏడాది డిజాస్టర్ అయిన సెవన్ అనే తెలుగు సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ అంశం ఉందంటే.. రెజీనా చేసిన విలన్ పాత్రే. ఐతే అలాంటి చిన్న సినిమాలో నెగెటివ్ రోల్ చేయడం పెద్ద విషయం కాదు కానీ.. ఇప్పుడు రెజీనా ఓ స్టార్ హీరో సినిమాలో ఓ సంచలన విలన్ పాత్ర చేసినట్లు సమాచారం. ఆ హీరో విశాల్ కాగా.. సినిమా పేరు చక్ర.
విశాల్ ఇంతకుముందు చేసిన ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు)కు కొనసాగింపులా కనిపిస్తున్న సైబర్ థ్రిల్లర్ చక్ర. ఆనందన్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. ఇందులోనూ విశాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రనే చేస్తుండగా.. హ్యాకింగ్లో ఆరితేరిన విలన్ మొత్తం వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని అందరినీ ఓ ఆటాడించే నేపథ్యంలో కథ నడిచేట్లు కనిపించింది ట్రైలర్ చూస్తే. అభిమన్యుడులో విలన్ అర్జున్ అనే విషయం ముందే వెల్లడైపోయింది. కానీ చక్రలో విలన్ ఎవరన్నది ట్రైలర్లో చూపించలేదు.
ఐతే ఆ పాత్ర చేసింది రెజీనా అని.. లేడీని పెద్ద విలన్గా చూపించడమే ఇందులో ట్విస్టు అని చిత్ర వర్గాల సమాచారం. శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రెజీనా కూడా నటిస్తున్నట్లు ఇంతకముందు వెల్లడైంది కానీ.. ట్రైలర్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. రెజీనా మాత్రం సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తుండటం విశేషం. విలన్ పాత్ర కావడం వల్ల దాన్ని సస్పెన్సుగా పెట్టారని సమాచారం. ఉన్నట్లుండి ట్రైలర్తో హడావుడి చేస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలొస్తున్నాయి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…