ప్రస్తుతం ఇండస్ట్రీలో సరైన కంటెంట్ దొరక్క రైటర్స్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నాయి. కానీ ఈ అవసరాలను తీర్చేందుకు సరిపడా రచయితలు మాత్రం దొరకడం లేదు. తిప్పి తిప్పి పాత కథలనే రీమిక్స్ చేసుకుంటూ ఒకే ఫార్ములాలో వెళ్తూ క్రియేటివిటీని చూపించలేకపోతున్నారు. ఓటిటిలు పెరిగిపోయాయి. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి కార్పొరేట్ సంస్థలు బిజినెస్ పెంచుకోవడమే లక్ష్యంగా కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించుకుని క్వాలిటీకి పెద్ద పీఠ వేస్తున్నాయి. ఆడియన్స్ ని కట్టిపడేసేలా తీస్తామంటే చాలు బడ్జెట్ పరిమితులు ఉండవని చెబుతున్నాయి.
అందుకే న్యూ జనరేషన్ మేకర్స్ మెల్లగా పాత నవలల వైపు మొగ్గు చూపుతున్నారు.ఇటీవలే హాట్ స్టార్ లో రిలీజైన 9 గంటలు ఎప్పుడో దశాబ్దాల క్రితం వచ్చిన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల. బోలెడంత సస్పెన్స్ తో థ్రిల్ చేస్తూ అప్పటి పత్రికలో సూపర్ హిట్ సీరియల్ గా నిలిచింది. దీన్ని ఇప్పటి ఆడియన్స్ సెన్సిబులిటీస్ కి తగ్గట్టుగా మార్చి తీయడం మంచి ఫలితాన్నే ఇస్తోంది. సమర్పకుల్లో ఒకరైన దర్శకుడు క్రిష్ వైష్ణవ్ తేజ్ తో చేసిన కొండపొలం కూడా పాపులర్ నవలే. ఆ మధ్య ఆహా యాప్ లో మెట్రో కథలు టైటిల్ తో పలాస దర్శకుడు కరుణ కుమార్ తో ఇలాంటి ప్రయత్నమే చేసింది. అదీ పర్వాలేదనిపించుకుంది. ఇలా చాలానే ఉన్నాయి.
నిజానికీ ఈ వింటేజ్ నవలల్లో వెతుక్కోవాలే కానీ బోలెడు మ్యాటర్ ఉంటుంది. యండమూరి, యద్దనపూడి, సూర్యదేవరలాంటి పాపులర్ రైటర్ల రచనలు ఎన్నో సినిమాలుగా మారడం 90 దశకం దాకా సాగింది. మధుబాబు రాసిన సుప్రసిద్ధ షాడో నవలలు త్వరలో వెబ్ సిరీస్ గా రాబోతున్నాయి. తవ్వుకుని చూస్తే ఇలాంటి సాహిత్యం బోలెడు దొరుకుతుంది. వాటిలో ఐడియాలను తీసుకుని ఇప్పటి జెనరేషన్ కు వండి వార్చితే బ్లాక్ బస్టర్ ఖాయం. మీనా నవలని నితిన్ అఆగా మార్చి త్రివిక్రమ్ లాంటి అగ్రదర్శకుడే హిట్టు కొట్టడం మర్చిపోకూడదు.
This post was last modified on June 3, 2022 6:14 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…