‘పిట్టగోడ’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు అనుదీప్ కేవీ. బిగ్ బాస్ ఫేమ్ పుణర్నవి కథానాయికగా నటించిన చిత్రమది. ఆ సినిమా రిలీజైనట్లుగా కూడా చాలామందికి తెలియదు. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే ఆ సినిమా వచ్చింది, వెళ్లిపోయింది. ఇలాంటి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనుదీప్కు ఇంకో సినిమా ఛాన్స్ వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అతను ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ను మెప్పించి తన నిర్మాణంలో ‘జాతిరత్నాలు’ చేశాడు.
ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో అతడి రేంజ్ మారిపోయింది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో పెద్ద బడ్జెట్లో ఓ ద్విభాషా చిత్రం చేసే అవకాశం దక్కించుకున్నాడు. కొన్ని నెలల కిందటే ఆ చిత్రం సెట్స్ మీదికి వెళ్లింది. ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ ఈ చిత్ర నిర్మాత. స్టార్ హీరో సినిమా, పెద్ద బడ్జెట్, పైగా తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కుతోంది కాబట్టి ఈ చిత్రం ఆలస్యం అవుతుందని అనుకున్నారంతా.
కానీ అనుదీప్ జెట్ స్పీడులో ఈ సినిమాను పూర్తి చేసేసినట్లు తెలుస్తోంది. చిత్రీకరణ చివరి దశకు వచ్చేయడంతో సినిమాకు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. వినాయక చవితి కానుకగా ఆగస్టు 31న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగానే ప్రకటించారు. అదే రోజు తమిళంలో కార్తి సినిమా ‘విరుమాన్’ కూడా రిలీజవుతోంది.
దాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తారు. వినాయక చవితి వీకెండ్ అంటే.. తెలుగులో ఇంకా ఒకటో రెండో పేరున్న సినిమాలే రిలీజ్ కావచ్చు. ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో శివ కార్తికేయన్కు తెలుగులో మంచి గుర్తింపే వచ్చింది. దీనికి తోడు అనుదీప్ సినిమా కావడంతో తెలుగులో పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేసే అవకాశముంది. మరి ఈ చిత్రంతో అనుదీప్ ఏమేర అంచనాలు అందుకుంటాడు.. శివకార్తికేయన్ తొలి తెలుగు చిత్రంతో ఎలాంటి ముద్ర వేస్తాడు.. చూద్దాం మరి.
This post was last modified on May 31, 2022 6:19 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…