Political News

మ‌హానాడులో తొడ‌గొట్టిన లేడీ లీడ‌ర్‌.. టికెట్ ద‌క్కేనా?

రాజ‌కీయాల్లో ఎవ‌రు ఏం చేసినా.. సొంత లాభం లేకుండా.. ఏ ఒక్క‌రు అడుగు కూడా ముందుకు వేయ‌రు. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరుగుతోంది. అధికార,  ప్ర‌తిప‌క్ష‌పార్టీల నాయ‌కులు ఎవ‌రైనా..కూడా `ముందు చూపు`తోనే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఒంగోలు వేదిక‌గా తొడ‌గొట్టిన టీడీపీ నాయ‌కురాలు కూడా చేరిపోయారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే టికెట్ ఆశించిన‌ప్ప‌టికీ.. ఆమెకు ఆశించిన విధంగా ఎలాంటి సానుభూతి రాలేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌హానాడులో తొడ‌గొట్ట‌డం ద్వారా.. అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. మ‌రి ఇప్ప‌టికైనా.. ఆ లేడీ లీడ‌ర్ క‌ల‌లు నెర‌వేరుతాయా?  అనేది ఆస‌క్తిగా మారింది.

ఇటీవ‌ల ఒంగోలులో జ‌రిగిన మ‌హానాడులో తొడ‌గొట్టిన నాయ‌కురాలు.. మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ. సామాన్యులే కాకుండా టీడీపీ వర్గాలు సైతం ఆమె వ్యాఖ్యల పట్ల ఆక‌ర్షితుల‌య్యారు. కావలి ప్రతిభా భారతి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నాయకురాలిగా పేరు సంపాదించారు. ప్రస్తుతం విజయనగరం లో కలిసిపోయిన రాజాం నుంచి ఆమె ప్రాతినిథ్యం వహించారు.

ప్రతిభా భారతి వారసురాలి గా గ్రీష్మ కొన్నాళ్లు ఇక్కడ హల్‌చల్‌ చేసినా ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఇన్నాళ్లూ ఉండి మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయనగా మళ్లీ జిల్లాకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే ఒంగోలు వేదికగా జరిగి న టీడీపీ మహానాడులో త‌న‌ ప్రసంగంతో పాటు తొడ‌గొట్టి.. అంద‌రినీ ఆక‌ర్షించారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.

ఉన్నత పదవులు అలంకరించిన కుటుంబానికి చెందిన వ్యక్తిగా.. వ్యూహ‌క‌ర్త‌గా ఆమె రూపొంద‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.  ఇక, రాజ‌కీయంగా చూసుకుంటే.. గ్రీష్మ తల్లి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నుంచి పలు పర్యాయాలు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయంగా జిల్లాలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. కాలక్రమేణా ఆమె రాజకీయంగా బలహీనమయ్యారు. ఆ పార్టీలోని గ్రూపు తగాదాలు, నేతల మధ్య విభేదాలతో పట్టు కోల్పోయారు.

ఈ క్రమంలో తల్లి స్థానాన్ని తాను భర్తీ చేయాలని గ్రీష్మ తాపత్రయ పడుతున్నారు. ప్రస్తుతం రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంగా ఉన్న రాజాం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఉంది. అక్కడ టీడీపీలో తనకు పోటీగా కోండ్రు మురళీమోహన్‌ ఉండటం, ఆయనకు టిక్కె ట్‌ వస్తుందేమోనన్న  చ‌ర్చ కూడా న‌డుస్తోంది. కానీ, కోండ్రు ముర‌ళీ .. ఈ మ‌ధ్య కాలంలో .. ఎక్క‌డా యాక్టివ్‌గా లేక పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ ద‌ఫా దూకుడు పెంచిన గ్రీష్మ‌కే ఖాయ‌మ‌ని అంటున్నారు.

This post was last modified on May 31, 2022 5:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

1 hour ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

2 hours ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

12 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago