టైటిల్స్ విషయంలో కొందరు దర్శకులు పైకి చెప్పకపోయినా కొన్ని సెంటిమెంట్లు బలంగా ఫాలో అవుతారనేది అందరికీ తెలిసిన విషయమే. కళాతపస్వి విశ్వనాథ్ శంకరాభరణం బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన సినిమాలన్నీ సతోనే మొదలయ్యాయి. సాగరసంగమం. స్వాతిముత్యం, స్వర్ణకమలం, స్వయంకృషి ఇలా సాగిపోయింది లైనప్. దీన్ని బ్రేక్ చేద్దామని ఆపద్బాంధవుడు, చిన్నబ్బాయి అని వేరే అక్షరాలాతో పెడితే ఫలితాలు తేడా కొట్టాయి. మళ్ళీ ఆయన ‘స’కు వెళ్ళిపోయినా మునుపటి స్థాయి విజయం దక్కలేదు.
ఇలాంటిదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య బాగా ఫాలో అవుతున్నారు. అఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, అతడు ఇలా అత్యధిక విజయాలన్నీ అతోనే మొదలయ్యాయి. అజ్ఞాతవాసి ఉంది కానీ ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ లే ఎక్కువ కాబట్టి దీన్ని పాజిటివ్ గానే చూడాలి. అందుకే నెక్స్ట్ చేయబోయే మహేష్ బాబు సినిమాకు అర్జునుడు టైటిల్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అప్పుడెప్పుడో పార్థు అని ప్రచారమయ్యింది కానీ ఫైనల్ గా ఇదే బెటరని ఫీలయ్యారట.
ఒకరకంగా అతడులో మొదటి చివరి అక్షరాలను తీసుకున్నట్టు అవుతుంది. అయితే మహేష్ గతంలో ఆల్రెడీ అర్జున్ చేశాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చెల్లి సెంటిమెంట్ గ్రాండియర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి అర్జునుడికి ఓకే చెబుతాడా ,లేదానేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. తమ కాంబోలో చివరి మూవీ ఖలేజాకు టీవీలో ఎన్ని ప్రశంసలు వచ్చినా కమర్షియల్ గా ఫ్లాపే కాబట్టి ఈసారి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే నిశ్చయంతో ఉన్నారు త్రివిక్రమ్. మరి ఎలాంటి సబ్జెక్టులో చూపించబోతున్నారో.
This post was last modified on May 23, 2022 4:19 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…