టైటిల్స్ విషయంలో కొందరు దర్శకులు పైకి చెప్పకపోయినా కొన్ని సెంటిమెంట్లు బలంగా ఫాలో అవుతారనేది అందరికీ తెలిసిన విషయమే. కళాతపస్వి విశ్వనాథ్ శంకరాభరణం బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన సినిమాలన్నీ సతోనే మొదలయ్యాయి. సాగరసంగమం. స్వాతిముత్యం, స్వర్ణకమలం, స్వయంకృషి ఇలా సాగిపోయింది లైనప్. దీన్ని బ్రేక్ చేద్దామని ఆపద్బాంధవుడు, చిన్నబ్బాయి అని వేరే అక్షరాలాతో పెడితే ఫలితాలు తేడా కొట్టాయి. మళ్ళీ ఆయన ‘స’కు వెళ్ళిపోయినా మునుపటి స్థాయి విజయం దక్కలేదు.
ఇలాంటిదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మధ్య బాగా ఫాలో అవుతున్నారు. అఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, అతడు ఇలా అత్యధిక విజయాలన్నీ అతోనే మొదలయ్యాయి. అజ్ఞాతవాసి ఉంది కానీ ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ లే ఎక్కువ కాబట్టి దీన్ని పాజిటివ్ గానే చూడాలి. అందుకే నెక్స్ట్ చేయబోయే మహేష్ బాబు సినిమాకు అర్జునుడు టైటిల్ ని త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. అప్పుడెప్పుడో పార్థు అని ప్రచారమయ్యింది కానీ ఫైనల్ గా ఇదే బెటరని ఫీలయ్యారట.
ఒకరకంగా అతడులో మొదటి చివరి అక్షరాలను తీసుకున్నట్టు అవుతుంది. అయితే మహేష్ గతంలో ఆల్రెడీ అర్జున్ చేశాడు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చెల్లి సెంటిమెంట్ గ్రాండియర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి అర్జునుడికి ఓకే చెబుతాడా ,లేదానేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. తమ కాంబోలో చివరి మూవీ ఖలేజాకు టీవీలో ఎన్ని ప్రశంసలు వచ్చినా కమర్షియల్ గా ఫ్లాపే కాబట్టి ఈసారి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే నిశ్చయంతో ఉన్నారు త్రివిక్రమ్. మరి ఎలాంటి సబ్జెక్టులో చూపించబోతున్నారో.
This post was last modified on May 23, 2022 4:19 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…