ప్రస్తుతం టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి అతి తక్కువ టైంలోనే స్టార్డం అందుకున్నాడు. ఈ నెలాఖరున F3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనీల్ నెక్స్ట్ బాలయ్యతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే సినిమాపై ఆసక్తి నెలకొంది. మొన్నీ మధ్య మహేష్ బాబు కోసం కథ రెడీ చేశానని ఆయన పిలవడమే ఆలస్యం మా కాంబోలో మరో సినిమా వస్తుందని చెప్పుకున్నాడు అనిల్.
దీంతో బాలయ్య సినిమా తర్వాత అనిల్ ఆల్మోస్ట్ మహేష్ బాబుతోనే సినిమా చేస్తాడని అనుకున్నారంత. కానీ తాజాగా నిర్మాత దిల్ రాజు మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. F4 కి కూడా ఓ పాయింట్ ఉందని ఇటివలే అనిల్ తనతో ఆ లైన్ చెప్పాడని కచ్చితంగా F2 ఫ్రాంచైజీ ఇలాగే కొనసాగుతుందని తెలిపాడు. ఇక F2 అవ్వగానే అనిల్ F3 లైన్ చెప్పి ‘సరిలేరు నీకెవ్వరు’ ఫినిష్ చేసుకొచ్చి ఈ ఫ్రాంచైజీ తీసాడని చెప్పారు రాజు.
అయితే దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే అనిల్ బాలయ్య సినిమా పూర్తిచేసుకొచ్చి F4 సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లెక్కన F2 ఫ్రాంచైజీ గ్యాప్ లో ఓ కమర్షియల్ సినిమా చేస్తూ కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నట్టున్నాడు అనిల్. ఇక F2 ఆ రేంజ్ హిట్ సాదిస్తుందని, తమకి అన్ని లాభాలు తెచ్చిపెడుతుందని నిర్మాత దిల్ రాజు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో F3 మీద అలాగే అనిల్ డైరెక్షన్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే ఫస్ట్ కట్ వచ్చే వరకూ F3 గురించి ఏం తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. మరి దిల్ రాజు నమ్మకాన్ని అనీల్ నిలబెట్టి మరో బ్లాక్ బస్టర్ అందిస్తే F4 సెట్స్ పైకి వెళ్తుంది లేదంటే ఈ ఫ్రాంచైజీకి ఇక్కడితో ఫులిస్టాప్ పడనుంది.
This post was last modified on May 19, 2022 9:47 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…