కరోనా అయిపోయింది. ఎక్కడా కేసులు లేవు. లాక్ డౌన్ల ప్రశ్నే లేదు. జన జీవనం ఎప్పుడో సాధారణమైపోయింది. ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అన్ని పరిశ్రమలు సర్దుకున్నాయి. సినిమా రంగం కూడా చక్కగా కుదురుకుంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 లు చెరో 1100 కోట్లు వసూలు సౌత్ ఇండస్ట్రీ సత్తాని ప్యాన్ ఇండియా లెవెల్ లో చాటాయి. వీటి ప్రభావం ఎంతగా ఉందంటే కేవలం డబ్బింగ్ వెర్షన్లతోనే నార్త్ లోనూ నెలరోజులకు పైగా సుదీర్ఘమైన రన్ దక్కించుకున్న బ్లాక్ బస్టర్స్ గా అరుదైన ఘనత సాధించాయి.
కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. ఈ రెండేళ్ల కాలంలో గర్వంగా చెప్పుకునే ఒక్కటంటే ఒక్క స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్ లేదు. ఎప్పటికప్పుడు కొత్తవి రిలీజ్ చేస్తున్నా అవి కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. మొన్న వచ్చిన జయేష్ భాయ్ జోర్దార్ ని అభిమానులే పట్టించుకోలేదు. దారుణమైన డిజాస్టర్. అంతకు ముందు వారం రన్ వే 34, హీరోపంటి 2 లు అత్తెసరు కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లకు నీరసం తెప్పించాయి. ఇక బచ్చన్ పాండే లాంటి వాటి గురించి సైలెంట్ గా ఉండటం ఉత్తమం.
ఇంత అనిశ్చితిని తమ సుదీర్ఘమైన అనుభవంలో ఎప్పుడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎల్లుండి రిలీజవుతున్న భూల్ భూలయ్యా 2 బుకింగ్స్ జస్ట్ పర్వాలేదనిపిస్తున్నాయి. ధాకడ్ ని అడిగే నాథుడు లేడు. ఖాన్ ద్వయం విపరీతమైన గ్యాప్ తీసుకోవడం ఈ పరిస్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. జూన్ 3న వచ్చే పృథ్విరాజ్ సైతం అద్భుతాలు చేస్తుందన్న నమ్మకం తక్కువే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా వచ్చే దాకా ఇప్పుడున్న సిచువేషన్ లో పెద్దగా మార్పు వచ్చేలా కనిపించడం లేదు. చూడాలి మరి.
This post was last modified on May 18, 2022 9:02 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…