రంగస్థలం సినిమాతో దర్శకుడు సుకుమార్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మామూలుగానే స్క్రిప్టుల విషయంలో విపరీతంగా శ్రమించే సుకుమార్.. ఈసారి ఇంకా పెరిగిపోయిన అంచనాల్ని అందుకోవడం కోసం మరింత కష్టపడ్డారు. ఏకంగా రెండేళ్లు సమయం తీసుకుని కొత్త సినిమాకు స్క్రిప్టు వండారు. మధ్యలో కొన్ని అనూహ్య పరిణామాలు జరిగి మహేష్తో అనుకున్న సినిమా కాస్తా అల్లు అర్జున్కు మారింది. దీని వల్ల కూడా కొంత ఆలస్యం జరిగింది.
అంతా మన మంచికే అన్నట్లుగా తన కథను మరింత రగ్డ్ స్టయిల్లో తీయడానికి సుక్కుకు అవకాశం వచ్చింది. హీరో మారిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్బస్టర్గా మలచాల్సిన ప్రెజర్ ఎదుర్కొంటున్నాడు సుక్కు. ఐతే ఎంతో కష్టపడి సినిమా చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేసుకుంటే కరోనా వచ్చి ఆయన ప్రణాళికలన్నింటినీ దెబ్బ తీసేసింది.
అసలే షూటింగ్ ఆలస్యమైంది.. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా సినిమాను త్వరగా లాగించేయాలనుకున్నాడు సుక్కు. ఇందుకోసం పక్కాగా షెడ్యూళ్లు వేసుకున్నాడు. ఈసారి సుక్కు ఎంచుకున్నది బాగా కాంప్లికేటెడ్ అయిన ఎర్రచందనం స్టోరీ. ఈ సినిమా మేకింగ్లో విపరీతమైన శ్రమ ఉంది. ఐతే ముందుగా సినిమాలో అత్యంత కష్టమైన ఎపిసోడ్లు లాగించేయాలని సుక్కు అనుకున్నాడు. తనతో పాటు నిర్మాతలు, టీం మొత్తంలో ఒక ఎనర్జీ, కాన్ఫిడెన్స్ తీసుకురావాలన్నది ఆయన ఉద్దేశం.
ఇందుకోసం సినిమా ఎసెన్స్ను తెలిపే హీరో ఇంట్రో సాంగ్, ఆ తర్వాత యాక్షన్ ఘట్టాలు, కీలక సన్నివేశాలు వరుసబెట్టి రెండు నెలల పాటు చిత్రీకరించాలని ఆయన అనుకున్నారు. కానీ కరోనా వచ్చి అందుకు అవకాశమే లేకుండా చేసింది. ఇవన్నీ భారీ కాస్ట్ అండ్ క్రూతో మూడిపడ్డవే. వందల్లో జూనియర్ ఆర్టిస్టులు అవసరం. కానీ ఇప్పుడు అంతమందితో షూటింగ్ చేసే పరిస్థితి లేదు. తను అనుకున్న చోట్ల అసలు షూటింగ్లకు అనుమతులూ కష్టంగా ఉంది. అలా అని ముందు చిన్నా చితకా సీన్లు తీసేద్దాం.. షరతులకు లోబడి షూటింగ్ చేద్దాం అంటే సుక్కు ఇష్టపడట్లేదట. కొంత కాలం ఎదురు చూసి అయినా తాను అనుకున్న సీన్లే ముందు తీయాలని ఆయన పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
This post was last modified on June 24, 2020 1:55 pm
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…