ఒకప్పుడు శత్రువు మొదలుకుని, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వరకు భారీ హిట్లు ఇచ్చి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఎం.ఎస్.రాజు. తన బేనర్లో తెరకెక్కే సినిమాల స్క్రిప్టు చర్చల్లోనూ కీలకంగా ఉంటూ, కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్గా కూడా క్రెడిట్ తీసుకుని.. తన సినిమాల విజయంలో ముఖ్య పాత్ర పోషించేవారు రాజు. ఎం.ఎస్. రాజు సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భరోసా ప్రేక్షకులకు కలిగించిన ఘనత ఆయన సొంతం.
నిర్మాతలకు ఇలాంటి ఇమేజ్ అరుదుగా వస్తుంటుంది. ఐతే ప్రొడ్యూసర్గా ఒక దశ దాటాక వరుస పరాజయాలు, దర్శకుడిగా చేసిన విఫల ప్రయత్నాలతో ఆయన బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బ తినేసింది. చాలా ఏళ్ల తర్వాత డర్టీ హరి అనే చిత్రంతో ఆయన పేరు కాస్త చర్చనీయాంశం అయింది. బోల్డ్ కంటెంట్తో యూత్ను బాగానే ఎంటర్టైన్ చేయగలిగారాయన. పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజైన ఆ సినిమా ఆయనకు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనమే కలిగించింది.
ఐతే బయటి హీరోతో మంచి ఫలితాన్నందుకున్న రాజు.. కొడుకును హీరోగా నిలబెడదామని డర్టీ హరి టైపు బోల్డ్ కంటెంట్తోనే 7 డేస్ 6 నైట్స్ అనే సినిమా తీశాడు. కానీ డర్టీ హరి లాగా ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రం.. వాయిదాల మీద వాయిదాలు పడింది. ఇప్పుడసలు ఈ సినిమా గురించి చర్చే లేదు. అందరూ దాని గురించి మరిచిపోయారు.
బిజినెస్ ఆఫర్లు ఏమీ లేవా.. లేక ఇంకేమైనా సమస్యలున్నాయేమో తెలియదు కానీ.. 7 డేస్ 6 నైట్స్ సినిమాను రాజు కూడా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. దాని సంగతి వదిలేసి ఇప్పుడు కొడుకు హీరోగా పెట్టి సతి అనే కొత్త సినిమా తీస్తున్నారాయన. దీని ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది. తన గత రెండు సినిమాలకు భిన్నంగా ఈసారి రూరల్ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నట్లున్నారాయన. కానీ ఇది కూడా ఏమంత ఆసక్తిని రేకెత్తించట్లేదు. ఇంతకీ ఈ కొత్త సినిమా సంగతి సరే.. 7 డేస్ 6 నైట్స్ మూవీని రాజు ఏం చేశాడో?
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…