ఒకప్పుడు శత్రువు మొదలుకుని, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వరకు భారీ హిట్లు ఇచ్చి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు ఎం.ఎస్.రాజు. తన బేనర్లో తెరకెక్కే సినిమాల స్క్రిప్టు చర్చల్లోనూ కీలకంగా ఉంటూ, కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్గా కూడా క్రెడిట్ తీసుకుని.. తన సినిమాల విజయంలో ముఖ్య పాత్ర పోషించేవారు రాజు. ఎం.ఎస్. రాజు సినిమా అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే భరోసా ప్రేక్షకులకు కలిగించిన ఘనత ఆయన సొంతం.
నిర్మాతలకు ఇలాంటి ఇమేజ్ అరుదుగా వస్తుంటుంది. ఐతే ప్రొడ్యూసర్గా ఒక దశ దాటాక వరుస పరాజయాలు, దర్శకుడిగా చేసిన విఫల ప్రయత్నాలతో ఆయన బ్రాండ్ వాల్యూ బాగా దెబ్బ తినేసింది. చాలా ఏళ్ల తర్వాత డర్టీ హరి అనే చిత్రంతో ఆయన పేరు కాస్త చర్చనీయాంశం అయింది. బోల్డ్ కంటెంట్తో యూత్ను బాగానే ఎంటర్టైన్ చేయగలిగారాయన. పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజైన ఆ సినిమా ఆయనకు ఆర్థికంగా కూడా మంచి ప్రయోజనమే కలిగించింది.
ఐతే బయటి హీరోతో మంచి ఫలితాన్నందుకున్న రాజు.. కొడుకును హీరోగా నిలబెడదామని డర్టీ హరి టైపు బోల్డ్ కంటెంట్తోనే 7 డేస్ 6 నైట్స్ అనే సినిమా తీశాడు. కానీ డర్టీ హరి లాగా ఈ సినిమా ప్రోమోలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్న ఈ చిత్రం.. వాయిదాల మీద వాయిదాలు పడింది. ఇప్పుడసలు ఈ సినిమా గురించి చర్చే లేదు. అందరూ దాని గురించి మరిచిపోయారు.
బిజినెస్ ఆఫర్లు ఏమీ లేవా.. లేక ఇంకేమైనా సమస్యలున్నాయేమో తెలియదు కానీ.. 7 డేస్ 6 నైట్స్ సినిమాను రాజు కూడా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. దాని సంగతి వదిలేసి ఇప్పుడు కొడుకు హీరోగా పెట్టి సతి అనే కొత్త సినిమా తీస్తున్నారాయన. దీని ఫస్ట్ లుక్ తాజాగా రిలీజైంది. తన గత రెండు సినిమాలకు భిన్నంగా ఈసారి రూరల్ బ్యాక్ డ్రాప్లో ఓ యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నట్లున్నారాయన. కానీ ఇది కూడా ఏమంత ఆసక్తిని రేకెత్తించట్లేదు. ఇంతకీ ఈ కొత్త సినిమా సంగతి సరే.. 7 డేస్ 6 నైట్స్ మూవీని రాజు ఏం చేశాడో?
This post was last modified on May 12, 2022 8:49 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…