Movie News

మ‌ళ్లీ ట్రోల్స్ బారిన ప‌డ్డ థ‌మ‌న్


ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభం నుంచి కూడా తెలుగులో అతను టాప్ సంగీత దర్శకుల్లో ఒకడిగా ఉంటున్నాడు. ఐతే ఎప్పటికప్పుడు భారీ సినిమాలు చేస్తున్నా సరే.. టాలీవుడ్లో తమన్ ఎదుర్కొన్నంత విమర్శలు, ట్రోలింగ్ ఎవరికీ ఎదురు కాలేదంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం అతను ఒక టైంలో ఒకే రకమైన ఊకదంపుడు పాటలు చేయడం, కొన్ని ఇంటర్నేషనల్ పాటల్ని కాపీ కొట్టడం, అలాగే తన ట్యూన్స్‌నే రిపీట్ చేయడం.

గత మూణ్నాలుగేళ్ల నుంచి మంచి ఫాంలో ఉంటూ వరుసగా మ్యూజికల్ బ్లాక్‌బస్టర్లు ఇస్తున్నా సరే.. అప్పుడప్పుడూ అతడి పాటలు ట్రోలర్స్‌కు టార్గెట్ అయిపోతున్నాయి. అందుక్కారణం తన ట్యూన్లను తనే అనుకరించడమే. ఇప్పుడు మరోసారి తమన్ అదే పని చేయడంతో సోషల్ మీడియా జనాలు అతణ్ని ఆటాడేసుకుంటున్నారు.

మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి తాజాగా ‘మ మ మహేషా’ అనే మాస్ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. మొన్న పల్లవి రిలీజైనపుడే జనాలకు ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా అనిపించింది. తమనే సంగీతం అందించిన ‘ఛల్ మోహన రంగా’ చిత్రంలో ఫస్ట్ లుక్కు సోమవారం అంటూ సాగే పాటకు చాలా దగ్గరగా అనిపించింది ఈ పాట పల్లవి కాకపోతే. నితిన్ సినిమాలోని పాట కొంచెం నెమ్మదిగా, క్లాస్‌గా సాగితే.. మహేష్ సాంగ్ వేగంగా, మాస్‌గా నడిచింది.

ఇక తాజాగా ‘మ మ మహేషా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయగా.. చరణం వింటుంటే తన పాటే ఒకటి యాజిటీజ్ దించేసినట్లున్నాడు తమన్. ‘సరైనోడు’ సినిమాలో ‘బ్లాక్‌బస్టర్’ పాట విని, దీన్ని వింటే ఏమీ తేడా అనిపించట్లేదు. దీని మీద అప్పుడే వీడియోలు రెడీ అయిపోయాయి. రెండు పాటలను పోలుస్తూ.. తమన్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరీ ఇంత సిమిలర్ ట్యూన్స్ ఎలా చేస్తాడు.. అంత పాపులర్ పాట ట్యూన్‌ను ఎలా రిపీట్ చేస్తాడు అంటూ అతణ్ని విమర్శిస్తున్నారు సంగీత ప్రియులు.

This post was last modified on May 8, 2022 10:45 am

Share
Show comments

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago