ఇప్పుడు తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే అనడంలో సందేహం లేదు. కెరీర్ ఆరంభం నుంచి కూడా తెలుగులో అతను టాప్ సంగీత దర్శకుల్లో ఒకడిగా ఉంటున్నాడు. ఐతే ఎప్పటికప్పుడు భారీ సినిమాలు చేస్తున్నా సరే.. టాలీవుడ్లో తమన్ ఎదుర్కొన్నంత విమర్శలు, ట్రోలింగ్ ఎవరికీ ఎదురు కాలేదంటే అతిశయోక్తి కాదు. అందుక్కారణం అతను ఒక టైంలో ఒకే రకమైన ఊకదంపుడు పాటలు చేయడం, కొన్ని ఇంటర్నేషనల్ పాటల్ని కాపీ కొట్టడం, అలాగే తన ట్యూన్స్నే రిపీట్ చేయడం.
గత మూణ్నాలుగేళ్ల నుంచి మంచి ఫాంలో ఉంటూ వరుసగా మ్యూజికల్ బ్లాక్బస్టర్లు ఇస్తున్నా సరే.. అప్పుడప్పుడూ అతడి పాటలు ట్రోలర్స్కు టార్గెట్ అయిపోతున్నాయి. అందుక్కారణం తన ట్యూన్లను తనే అనుకరించడమే. ఇప్పుడు మరోసారి తమన్ అదే పని చేయడంతో సోషల్ మీడియా జనాలు అతణ్ని ఆటాడేసుకుంటున్నారు.
మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ నుంచి తాజాగా ‘మ మ మహేషా’ అనే మాస్ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. మొన్న పల్లవి రిలీజైనపుడే జనాలకు ట్యూన్ ఎక్కడో విన్నట్లుగా అనిపించింది. తమనే సంగీతం అందించిన ‘ఛల్ మోహన రంగా’ చిత్రంలో ఫస్ట్ లుక్కు సోమవారం అంటూ సాగే పాటకు చాలా దగ్గరగా అనిపించింది ఈ పాట పల్లవి కాకపోతే. నితిన్ సినిమాలోని పాట కొంచెం నెమ్మదిగా, క్లాస్గా సాగితే.. మహేష్ సాంగ్ వేగంగా, మాస్గా నడిచింది.
ఇక తాజాగా ‘మ మ మహేషా’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయగా.. చరణం వింటుంటే తన పాటే ఒకటి యాజిటీజ్ దించేసినట్లున్నాడు తమన్. ‘సరైనోడు’ సినిమాలో ‘బ్లాక్బస్టర్’ పాట విని, దీన్ని వింటే ఏమీ తేడా అనిపించట్లేదు. దీని మీద అప్పుడే వీడియోలు రెడీ అయిపోయాయి. రెండు పాటలను పోలుస్తూ.. తమన్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరీ ఇంత సిమిలర్ ట్యూన్స్ ఎలా చేస్తాడు.. అంత పాపులర్ పాట ట్యూన్ను ఎలా రిపీట్ చేస్తాడు అంటూ అతణ్ని విమర్శిస్తున్నారు సంగీత ప్రియులు.
This post was last modified on May 8, 2022 10:45 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…