చాలా తక్కువ సమయంలో తెలుగులో పెద్ద డైరెక్టర్లలో ఒకడైపోయాడు అనిల్ రావిపూడి. పటాస్ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం ఆరంభించిన అతను.. ఆ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2 చిత్రాలతో వరుస విజయాలందుకున్నాడు. దీంతో మహష్ బాబు లాంటి సూపర్ స్టార్ అతడికి ఛాన్స్ ఇచ్చాడు. మహేష్ నమ్మకాన్ని నిలబెడుతూ.. ‘సరిలేరు నీకెవ్వరు’తో సూపర్ హిట్ అందించాడు అనిల్. ఈ చిత్రానికి కొంత డివైడ్ టాక్ వచ్చినా తట్టుకుని బాక్సాఫీస్ విన్నర్గా నిలిచింది.
దీంతో అనిల్తో మరో సినిమా చేయడానికి మహేష్ ఆసక్తి చూపించాడు. కాకపోతే వీరి కలయికలో ఇంకో సినిమా రావడానికి టైం పట్టేట్లుంది. మహేష్కు ఉన్న కమిట్మెంట్లే అందుక్కారణం. ‘సరిలేరు..’ అనంతరం ‘సర్కారు వారి పాట’ను పూర్తి చేశాడు మహేష్. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేయాల్సి ఉంది. మరోవైపు రాజమౌళి సినిమాలోనూ నటించాల్సి ఉంది.
ఐతే జక్కన్న సినిమాను మొదలుపెట్టేలోపు.. త్రివిక్రమ్ సినిమా అయ్యాక ఖాళీ దొరికి ఇంకో సినిమా చేసే అవకాశం ఉంటే చెప్పలేం. ఒకవేళ మహేష్ అప్పుడు అందుబాటులోకి వస్తే తప్పక ఆయనతో సినిమా చేస్తాననే సంకేతాలు ఇస్తున్నాడు అనిల్ రావిపూడి. ఓ ఇంగ్లిష్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. మహేష్ కోసం తాను కథ రాస్తున్నట్లు వెల్లడించాడు. మహేష్ తనతో మరో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడని.. కానీ ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియదని.. ఐతే తాను మాత్రం స్క్రిప్టు పని మొదలుపెట్టేశానని అతను చెప్పాడు.
సూపర్ స్టార్ కోసం ఎగ్జైటింగ్ స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు అనిల్ తెలిపాడు. మహేష్ తన కమిట్మెంట్లన్నీ పూర్తి చేసుకుని.. అనిల్ సినిమా చేద్దామా అంటే చాలని, తాను సినిమాను మొదలుపెట్టేస్తానని.. అందుకే ఇప్పట్నుంచే దాని మీద పని చేస్తున్నానని అనిల్ వెల్లడించాడు. మరోవైపు నందమూరి బాలకృష్ణతోనూ అనిల్కు ఓ కమిట్మెంట్ ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్యతో సినిమా చేయాలన్నది తన కల అని.. ఆయన కోసం ఒక కొత్త పాయింట్తో స్క్రిప్టు రెడీ చేస్తున్నట్లు కూడా అనిల్ వెల్లడించాడు. అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఎఫ్-3’ వచ్చే నెలాఖర్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 29, 2022 3:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…