‘ఆచార్య’ రిలీజ్ దగ్గరపడుతుండటంతో తాజాగా ఓ మీడియా ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మెగా స్టార్ కి ఏ చేదు ప్రశ్న ఎదురైంది. “చిరంజీవి గారి సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచాల్సిన అవసరం ఏముంది ? ‘ అనేది ప్రశ్న. దీనికి సమాధానంగా చిరంజీవి మాట్లాడుతూ “కరోన కారణంగా అన్ని పరిశ్రమలు కుంటి పడ్డాయి. అలాగే సినిమా పరిశ్రమ కూడా లాస్ అయింది. 50 కోట్ల వడ్డీ కట్టడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా ? మేము కట్టాము. ఎవరిస్తారు చెప్పండి. ప్రభుత్వాలు కనికరించి అలాంటి జీవో ఇస్తే బాగుంటుంది.” అన్నారు.
ఇక ఇన్ని కోట్ల వ్యయం పెట్టి మనకి వినోదం అందించారని ప్రేక్షకులు కూడా సరే మనం కూడా ఇద్దాం అంటూ ఓ పది రూపాయలు సాయం అందించారు. అది అడుక్కోవడం కాదు. అవసరంలో ఉన్న వారికి చేయూత. మా సినిమాకు ఓ మీడియం బడ్జెట్ సినిమా అంత వడ్డీ అయినప్పుడు.
టికెట్ రేటు పెంచడంలో తప్పేముంది ? పైగా ప్రభుత్వాలకు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మేము. అందులో నుండి కొంత అడిగి తీసుకుంటున్నాం అంతే. ఇది టికెట్ రేటు పెంచడం పై చిరు రియాక్షన్. నిజానికి ఆచార్య బుకింగ్స్ స్టార్ట్ అవ్వగానే అందరూ టికెట్ రేటు గురించి మాట్లాడుకున్నారు.
ఒకరకంగా బుకింగ్స్ స్పీడుగా ఫిల్ అవ్వకపోవడానికి రీజన్ కూడా ఇదే. టికెటు కొనాలంటే ఎవరైనా ఆలోచించే పరిస్థితి. కానీ ఇండస్ట్రీకి ఈ ఇష్యూ మీద ఓ వర్షన్ ఉంది. కరోన నేపథ్యంలో తాము ఎంతో నష్టపోయామని , అధిక వడ్డీ కట్టి సినిమా రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఏదేమైనా టికెటు రేటు పెంపకం గురించి చిరు సీరియస్ రియాక్షన్ హాట్ టాపిక్ గా మారింది.
This post was last modified on April 26, 2022 5:51 pm
టాలీవుడ్లో ఒకప్పుడు మాంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకుల్లో వైవీఎస్ చౌదరి ఒకరు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు చిత్రాలతో…
ఈ మధ్య అమీర్ ఖాన్ ఇంటర్వ్యూలలో మహాభారతం ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అంటూ త్వరలోనే…
కొందరు సెలబ్రిటీలు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఒక్కోసారి చిన్న ట్వీట్లు, స్టేటస్ లే పెద్ద రాద్ధాంతానికి దారి…
నిన్నటిదాకా ఖచ్చితంగా మే 30 వస్తామని చెప్పిన కింగ్ డమ్ వాయిదా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్…
పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత్ శుక్రవారం మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. దేశంలోని అన్ని పోర్టులు, అంతరిక్ష…
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి పాక్ వైఖరే కారణం. ఈ…