‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భీమ్ పాత్రతో అతను దేశవ్యాప్తంగా మంచి గుర్తింపే సంపాదించాడు. తన క్రేజ్, మార్కెట్ను ఎంతగానో పెంచుకున్నాడు. కాకపోతే క్యారెక్టర్ పరంగా రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువ అనిపించడంతో జూనియర్ అభిమానులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సంగతి పక్కన పెట్టేసి.. తారక్ కొత్త సినిమా మీదికి వాళ్ల దృష్టి మళ్లింది.
ఐతే కొరటాల శివతో చేయాల్సిన ఈ సినిమా బాగా ఆలస్యం అవుతుండటం పట్ల వారిలో అసంతృప్తి ఉంది. ఏడాది కిందట అనౌన్స్మెంట్ ఇచ్చాక ఈ సినిమా గురించి ఏ అప్డేట్ లేకపోవడం వారికి రుచించట్లేదు. ఐతే జూన్లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ వెల్లడించడం వారికి ఊరట. ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి కొరటాల చెప్పిన మాటలు తారక్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చేవే అనడంలో సందేహం లేదు.
‘జనతా గ్యారేజ్’ చేస్తున్నపుడే తామిద్దరం తర్వాత చేయబోయే సినిమా గురించి మాట్లాడుకున్నామని.. ఆ సినిమాను కొంచెం క్లాస్గా, సటిల్గా తీశామని.. ఈసారికి ఇలా కానిచ్చేద్దామని, కానీ తర్వాతి సినిమా చేసినపుడు మాస్గా చేద్దామని తారక్కు తాను అప్పుడే చెప్పానని కొరటాల తెలిపాడు. ఈసారి తారక్తో చేయబోయేది చాలా పెద్ద సినిమా అని కొరటాల వెల్లడించాడు. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ స్క్రిప్ట్ అని కొరటాల స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
దీని కాన్వాస్ చాలా పెద్దదని.. తారక్ పాత్ర కూడా అందుకు తగ్గట్లే ఉంటుందని.. తన కెరీర్లో ‘మిర్చి’ పెద్ద మాస్ సినిమా అనుకుంటే.. దాన్ని మించిన మాస్, కమర్షియల్ విలువలు ఇందులో ఉంటాయని కొరటాల చెప్పాడు. తారక్ పాత్ర చాలా కొత్తగా, ఇప్పటిదాకా చేయని విధంగా ఉంటుందని కూడా కొరటాల చెప్పాడు. ఈ సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కూడా వివరించాడు. ఈ మాటలు తారక్ అభిమానులకు మామూలు ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు. మరి కొరటాల మాటలకు తగ్గట్లే సినిమా ఉంటే బాక్సాఫీస్ ఊచకోత ఖాయమే.
This post was last modified on April 26, 2022 5:44 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…