‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భీమ్ పాత్రతో అతను దేశవ్యాప్తంగా మంచి గుర్తింపే సంపాదించాడు. తన క్రేజ్, మార్కెట్ను ఎంతగానో పెంచుకున్నాడు. కాకపోతే క్యారెక్టర్ పరంగా రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువ అనిపించడంతో జూనియర్ అభిమానులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సంగతి పక్కన పెట్టేసి.. తారక్ కొత్త సినిమా మీదికి వాళ్ల దృష్టి మళ్లింది.
ఐతే కొరటాల శివతో చేయాల్సిన ఈ సినిమా బాగా ఆలస్యం అవుతుండటం పట్ల వారిలో అసంతృప్తి ఉంది. ఏడాది కిందట అనౌన్స్మెంట్ ఇచ్చాక ఈ సినిమా గురించి ఏ అప్డేట్ లేకపోవడం వారికి రుచించట్లేదు. ఐతే జూన్లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ వెల్లడించడం వారికి ఊరట. ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి కొరటాల చెప్పిన మాటలు తారక్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చేవే అనడంలో సందేహం లేదు.
‘జనతా గ్యారేజ్’ చేస్తున్నపుడే తామిద్దరం తర్వాత చేయబోయే సినిమా గురించి మాట్లాడుకున్నామని.. ఆ సినిమాను కొంచెం క్లాస్గా, సటిల్గా తీశామని.. ఈసారికి ఇలా కానిచ్చేద్దామని, కానీ తర్వాతి సినిమా చేసినపుడు మాస్గా చేద్దామని తారక్కు తాను అప్పుడే చెప్పానని కొరటాల తెలిపాడు. ఈసారి తారక్తో చేయబోయేది చాలా పెద్ద సినిమా అని కొరటాల వెల్లడించాడు. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ స్క్రిప్ట్ అని కొరటాల స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
దీని కాన్వాస్ చాలా పెద్దదని.. తారక్ పాత్ర కూడా అందుకు తగ్గట్లే ఉంటుందని.. తన కెరీర్లో ‘మిర్చి’ పెద్ద మాస్ సినిమా అనుకుంటే.. దాన్ని మించిన మాస్, కమర్షియల్ విలువలు ఇందులో ఉంటాయని కొరటాల చెప్పాడు. తారక్ పాత్ర చాలా కొత్తగా, ఇప్పటిదాకా చేయని విధంగా ఉంటుందని కూడా కొరటాల చెప్పాడు. ఈ సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కూడా వివరించాడు. ఈ మాటలు తారక్ అభిమానులకు మామూలు ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు. మరి కొరటాల మాటలకు తగ్గట్లే సినిమా ఉంటే బాక్సాఫీస్ ఊచకోత ఖాయమే.
This post was last modified on April 26, 2022 5:44 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…