‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భీమ్ పాత్రతో అతను దేశవ్యాప్తంగా మంచి గుర్తింపే సంపాదించాడు. తన క్రేజ్, మార్కెట్ను ఎంతగానో పెంచుకున్నాడు. కాకపోతే క్యారెక్టర్ పరంగా రామ్ చరణ్ డామినేషన్ ఎక్కువ అనిపించడంతో జూనియర్ అభిమానులు కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సంగతి పక్కన పెట్టేసి.. తారక్ కొత్త సినిమా మీదికి వాళ్ల దృష్టి మళ్లింది.
ఐతే కొరటాల శివతో చేయాల్సిన ఈ సినిమా బాగా ఆలస్యం అవుతుండటం పట్ల వారిలో అసంతృప్తి ఉంది. ఏడాది కిందట అనౌన్స్మెంట్ ఇచ్చాక ఈ సినిమా గురించి ఏ అప్డేట్ లేకపోవడం వారికి రుచించట్లేదు. ఐతే జూన్లో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ వెల్లడించడం వారికి ఊరట. ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా గురించి కొరటాల చెప్పిన మాటలు తారక్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చేవే అనడంలో సందేహం లేదు.
‘జనతా గ్యారేజ్’ చేస్తున్నపుడే తామిద్దరం తర్వాత చేయబోయే సినిమా గురించి మాట్లాడుకున్నామని.. ఆ సినిమాను కొంచెం క్లాస్గా, సటిల్గా తీశామని.. ఈసారికి ఇలా కానిచ్చేద్దామని, కానీ తర్వాతి సినిమా చేసినపుడు మాస్గా చేద్దామని తారక్కు తాను అప్పుడే చెప్పానని కొరటాల తెలిపాడు. ఈసారి తారక్తో చేయబోయేది చాలా పెద్ద సినిమా అని కొరటాల వెల్లడించాడు. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ స్క్రిప్ట్ అని కొరటాల స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.
దీని కాన్వాస్ చాలా పెద్దదని.. తారక్ పాత్ర కూడా అందుకు తగ్గట్లే ఉంటుందని.. తన కెరీర్లో ‘మిర్చి’ పెద్ద మాస్ సినిమా అనుకుంటే.. దాన్ని మించిన మాస్, కమర్షియల్ విలువలు ఇందులో ఉంటాయని కొరటాల చెప్పాడు. తారక్ పాత్ర చాలా కొత్తగా, ఇప్పటిదాకా చేయని విధంగా ఉంటుందని కూడా కొరటాల చెప్పాడు. ఈ సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కూడా వివరించాడు. ఈ మాటలు తారక్ అభిమానులకు మామూలు ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు. మరి కొరటాల మాటలకు తగ్గట్లే సినిమా ఉంటే బాక్సాఫీస్ ఊచకోత ఖాయమే.
This post was last modified on April 26, 2022 5:44 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…