‘ఆచార్య’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్రంలో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్ గురించి ఎవ్వరూ మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. కాజల్ ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఆమె ఈ ఈవెంట్లో పాల్గొనే అవకాశం లేదని తెలుసు కానీ.. ఆమె గురించి ఎవ్వరూ మాట్లాడకపోవడం ఏంటి అనే సందేహాలు కలిగాయి. ఈ సినిమాలో కాజల్ ఉందా లేదా అనే అనుమానాలు కూడా ఈ ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి.
ఇప్పుడు ఆ అనుమానమే నిజమని తేలింది. ‘ఆచార్య’ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కాజల్ పాత్ర ఉండదని తేల్చేశాడు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశాక తన పాత్రకు న్యాయం చేయలేమని భావించిన దాన్ని సినిమా నుంచి తీసేసినట్లు, ఇదంతా సుహృద్భావ వాతావరణంలోనే జరిగినట్లు కొరటాల వెల్లడించాడు.
దీని గురించి కొరటాల వివరిస్తూ.. ‘‘ఆచార్య సినిమాలో చిరంజీవి పాత్రకు మామూలుగా చూస్తే లవ్ ఇంట్రెస్ట్ ఉండదు. ఉండకూడదు. కానీ కమర్షియల్ ఫార్మాట్లో అలాంటి పెద్ద హీరోకు హీరోయిన్ లేకుంటే బాగుండదని పెట్టాం. ధర్మస్థలిలో సరదాగా ఉండే ఒక ఫన్నీ క్యారెక్టర్ డిజైన్ చేసి దానికి కాజల్ అగర్వాల్ను తీసుకున్నాం. తొలి షెడ్యూల్లో 3-4 రోజులు ఆమె మీద చిత్రీకరణ కూడా జరిపాం. కానీ ఆ పాత్రను పేపర్ మీద రాస్తున్నపుడే కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మేం షూట్ చేసిన రషెస్ చూసుకున్న తర్వాత ఆ సందేహాలు మరింత పెరిగాయి.
అంత పెద్ద హీరోయిన్ని ఏదో క్యారెక్టర్ కోసం అంటే క్యారెక్టర్ అన్నట్లు పెట్టలేం. ఆచార్యకు లవ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లు చూపించడం కరెక్ట్గా అనిపించలేదు. హీరోయిన్ పాటలు పెట్టడం, తన పాత్రను ముగించడంలో ఇబ్బంది అనిపించింది. ఇదే మాట చిరంజీవి గారితో చెబితే.. మీరు ఏది నమ్మితే అది చేయండి అన్నారు. కాజల్కు కూడా విషయం చెప్పమన్నారు. తనకు ఇదే విషయం చెబితే.. అందంగా ఒక నవ్వు నవ్వి, ఐయామ్ మిస్సింగ్ దిస్ ఫిలిం, మళ్లీ వీలున్నపుడు కలిసి పని చేద్దాం అన్నారు’’ అంటూ అసలు విషయం చెప్పారు కొరటాల.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…