బాహుబలి-2 నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టడం ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సాధ్యం కాని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల వరకు ఆ రికార్డులను అధిగమించినప్పటికీ.. అప్పటికి, ఇప్పటికి పెరిగిన టికెట్ల ధరలు, పెరిగిన స్క్రీన్లు, షోలను బట్టి చూస్తే అది మరీ గొప్ప విషయమేమీ కాదనే చెప్పాలి. ఏపీ, తెలంగాణను మినహాయిస్తే ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో బాహుబలి-2 రికార్డులు పదిలంగా ఉన్నాయి.
రాజమౌళే తాను నెలకొల్పిన రికార్డులను తనే అధిగమించలేకపోయాడు. అలాంటిది ‘కేజీఎఫ్-2’.. ఇప్పట్లో అసాధ్యం అనుకున్న ‘బాహుబలి-2’ తొలి రోజు హిందీ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసింది. నార్త్ ఇండియాలో అంచనాలను మించి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఏకంగా రూ.60 కోట్ల గ్రాస్ వసూల్ల క్లబ్బులోకి చేరింది. ఇప్పటిదాకా హిందీ మార్కెట్లో ఏ చిత్రం కూడా రూ.60 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టలేదు.
‘బాహుబలి: ది కంక్లూజన్’ ఐదేళ్ల కిందట రూ.58 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నెలకొల్పిన రికార్డును ‘కేజీఎఫ్-2’ అధిగమించింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినపుడే హిందీ మార్కెట్లో వసూళ్లు అసాధారణ స్థాయిలో ఉంటాయని అంచనా వేశారు ట్రేడ్ పండిట్లు. ఇక గత వారం వ్యవధిలో రోజు రోజుకూ క్రేజ్ పెరిగిపోవడం, ‘జెర్సీ’ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో ‘కేజీఎఫ్-2’కు ఎదురే లేకపోయింది.
అడ్వాన్స్ బుకింగ్స్తోనే ‘కేజీఎఫ్’ హిందీ వెర్షన్ రూ.30 కోట్ల మార్కును దాటేయడంతో ‘బాహుబలి-2’ రికార్డుకు ఎసరు పెట్టడం ఖాయమనిపించింది. ఇప్పుడు ఆ అంచనాకు తగ్గట్లే రికార్డును దాటేసింది. ‘బాహుబలి-2’ రికార్డు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ చిత్రాలకు, రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. నెవర్ బిఫోర్ ఎలివేషన్లు, అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతూలగిస్తుండగా.. హిందీ ప్రేక్షకులు మరింతగానే ఈ సినిమాతో ఎంటర్టైన్ అవుతున్నట్లున్నారు.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…