బాహుబలి-2 నెలకొల్పిన రికార్డులను బద్దలు కొట్టడం ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సాధ్యం కాని పరిస్థితి. తెలుగు రాష్ట్రాల వరకు ఆ రికార్డులను అధిగమించినప్పటికీ.. అప్పటికి, ఇప్పటికి పెరిగిన టికెట్ల ధరలు, పెరిగిన స్క్రీన్లు, షోలను బట్టి చూస్తే అది మరీ గొప్ప విషయమేమీ కాదనే చెప్పాలి. ఏపీ, తెలంగాణను మినహాయిస్తే ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో బాహుబలి-2 రికార్డులు పదిలంగా ఉన్నాయి.
రాజమౌళే తాను నెలకొల్పిన రికార్డులను తనే అధిగమించలేకపోయాడు. అలాంటిది ‘కేజీఎఫ్-2’.. ఇప్పట్లో అసాధ్యం అనుకున్న ‘బాహుబలి-2’ తొలి రోజు హిందీ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టేసింది. నార్త్ ఇండియాలో అంచనాలను మించి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఏకంగా రూ.60 కోట్ల గ్రాస్ వసూల్ల క్లబ్బులోకి చేరింది. ఇప్పటిదాకా హిందీ మార్కెట్లో ఏ చిత్రం కూడా రూ.60 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టలేదు.
‘బాహుబలి: ది కంక్లూజన్’ ఐదేళ్ల కిందట రూ.58 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో నెలకొల్పిన రికార్డును ‘కేజీఎఫ్-2’ అధిగమించింది. ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టినపుడే హిందీ మార్కెట్లో వసూళ్లు అసాధారణ స్థాయిలో ఉంటాయని అంచనా వేశారు ట్రేడ్ పండిట్లు. ఇక గత వారం వ్యవధిలో రోజు రోజుకూ క్రేజ్ పెరిగిపోవడం, ‘జెర్సీ’ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో ‘కేజీఎఫ్-2’కు ఎదురే లేకపోయింది.
అడ్వాన్స్ బుకింగ్స్తోనే ‘కేజీఎఫ్’ హిందీ వెర్షన్ రూ.30 కోట్ల మార్కును దాటేయడంతో ‘బాహుబలి-2’ రికార్డుకు ఎసరు పెట్టడం ఖాయమనిపించింది. ఇప్పుడు ఆ అంచనాకు తగ్గట్లే రికార్డును దాటేసింది. ‘బాహుబలి-2’ రికార్డు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ చిత్రాలకు, రాజమౌళి, ప్రభాస్ సినిమాలకు కూడా సాధ్యం కాని ఘనత ఇది. నెవర్ బిఫోర్ ఎలివేషన్లు, అద్భుతమైన విజువల్స్, కళ్లు చెదిరే యాక్షన్ ఘట్టాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతూలగిస్తుండగా.. హిందీ ప్రేక్షకులు మరింతగానే ఈ సినిమాతో ఎంటర్టైన్ అవుతున్నట్లున్నారు.
This post was last modified on April 15, 2022 2:55 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…