ఒకప్పుడు తెలుగు బాక్సాఫీస్ మీద తమిళ సినిమాల దండయాత్ర మామూలుగా ఉండేది కాదు. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, సూర్య, కార్తి.. ఇలా చాలామంది కోలీవుడ్ స్టార్ల సినిమాలు తెలుగులో ఇరగాడేసేవి. వాళ్ల సినిమాలకు పోటీగా మన చిత్రాలు రిలీజ్ చేయడానికి భయపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఐతే కాల క్రమంలో వీళ్లందరికీ తెలుగులో ఫాలోయింగ్ పడిపోయింది. తమిళ అనువాద చిత్రాలను మన వాళ్లు అంతగా పట్టించుకోవడం లేదు.
ఐతే గతంలో మంచి ఫాలోయింగ్ ఉన్న తమిళ స్టార్లందరికీ ఇక్కడ డిమాండ్ పడిపోతే.. ఒకప్పుడు ఇక్కడ ఏమాత్రం గుర్తింపు లేని విజయ్కి గత కొన్నేళ్లలో మన దగ్గర ఫాలోయింగ్ పెరిగింది. అదిరింది, విజిల్, మాస్టర్.. ఇలా వరుసగా అతడి సినిమాలు తెలుగులో బాగా ఆడేస్తున్నాయి. అతడి మార్కెట్ పది కోట్ల మార్కును కూడా టచ్ చేసింది. ఐతే ఇలా పెరుగుతున్న తన ఫాలోయింగ్, మార్కెట్ను ఇంకో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం విజయ్ చేయట్లేదు. తన సినిమాలను బాగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి అతడికి తీరిక ఉండట్లేదు.
బీస్ట్కు తెలుగులో మంచి క్రేజే ఉన్నా.. దాన్ని మరింత పెంచే ప్రయత్నం విజయ్ చేయట్లేదు. తమిళంలో ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఒకప్పుడు సూర్య లాగా తెలుగు ప్రేక్షకులను ఓన్ చేసుకుని వారికి చేరువ కావాలని విజయ్ చూడట్లేదు. మన తెలుగు స్టార్లు తమిళంలో రిలీజయ్యే తమ సినిమాల ప్రమోషన్ల కోసం చక్కగా చెన్నైకి వెళ్లి ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు ఇలాగే చక్కగా ప్రమోషన్లు చేశారు. ఆ సినిమాలకు ఎంత మంచి ఫలితం వచ్చిందో తెలిసిందే. కేవలం ప్రమోషన్లతో సినిమాలు ఆడేయవు కానీ.. సినిమాలు బాగుంటే ప్రమోషన్లు ప్లస్ అవుతాయన్నది వాస్తవం.
ఐతే తన రేంజికి హైదరాబాద్ వచ్చి తన సినిమాను ప్రమోట్ చేయడం ఏంటి అనుకుంటున్నాడో ఏమో.. విజయ్ ఇటు వైపు చూడట్లేదు. గతంలో తనకు ఇక్కడ గుర్తింపు లేనపుడు స్నేహితుడు, జిల్లా మూవీస్ ని ప్రమోట్ చేసిన విజయ్.. ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగాక ఇటు వైపు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. శుక్రవారం జరిగిన విజయ్ కొత్త చిత్రం బీస్ట్ ప్రమోషనల్ ఈవెంట్లో హీరోయిన్ పూజా హెగ్డే, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, దర్శకుడు నెల్సన్ మాత్రమే హాజరయ్యారు.
This post was last modified on April 9, 2022 8:36 am
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…
కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…
డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్లైన్ రైతు బజార్ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…
సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…
అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…