దక్షిణాది సినిమాల్లో మంచి మంచి అవకాశాలు అందుకుని తమ టైం నడిచినన్నాళ్లు చాలా స్వీట్గా మాట్లాడతారు ఉత్తరాది భామలు. కానీ ఇక్కడ ఛాన్సులు తగ్గి, బాలీవుడ్లో అవకాశాలు దక్కగానే వారి స్వరం మారిపోతుంటుంది. సౌత్ సినిమాను తక్కువ చేసి మాట్లాడ్డం వాళ్లకు ఫ్యాషన్ అయిపోతుంటుంది. ఇలియానా, తాప్సి లాంటి వాళ్లు దక్షిణాదిన ఏ అభ్యంతరం లేకుండా గ్లామర్ రోల్స్ చేసి, కోట్లు సంపాదించుకుని.. అనుకోకుండా బాలీవుడ్లో అవకాశాలు అందుకున్నాక తెలుగు చిత్రాల గురించి ఎలా మాట్లాడారో గుర్తుండే ఉంటుంది.
ఇక్కడి వాళ్లకు గ్లామర్ మీదే ఫోకస్ అని, తమ టాలెంటును గుర్తించలేదని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గ్లామర్ రోల్స్ ఇష్టం లేనపుడు వాటిని తిరస్కరించడం వాళ్ల చేతుల్లోనే ఉన్నా.. ఆ పని మాత్రం చేయరు. డబ్బుల కోసం ఏ పాత్ర ఆఫర్ చేస్తే అది చేసి.. ఆ తర్వాత ఇలా మాట మార్చడం విడ్డూరం. ఇప్పుడు రాశి ఖన్నా కూడా వీరి బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.తెలుగులో ఒకప్పుడు వరుసగా అవకాశాలు అందుకున్న రాశికి.. ఇప్పుడు ఛాన్సులు తగ్గిపోయాయి.
ఇలాంటి టైంలో ఆమె చూపులు బాలీవుడ్పై పడ్డాయి. అజయ్ దేవగణ్లో కలిసి ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ చేసిన ఆమె.. షాహిద్ కపూర్ సరసన ఓ సినిమాకు కమిటైంది. ‘రుద్ర’కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ ఫిలిం మేకర్స్ మైండ్ సెట్ గురించి మాట్లాడింది రాశి.
‘‘దక్షిణాది సినిమాలో గ్లామర్ డాల్, గొప్ప నటి అని విభజించి చూస్తారు. నేను అక్కడ కమర్షియల్ సినిమాల్లో కొన్ని మంచి పాత్రలు చేశాను. కానీ నేను అందంగా ఉన్నానని, పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు సరిపోనంటూ కొందరు నాకు ఛాన్సులు ఇవ్వలేదు. అక్కడి వాళ్లు అందాన్ని తప్ప టాలెంటుని చూడరు. నన్ను మంచి నటిగా గుర్తించలేదు. దీంతో ఒకే తరహా పాత్రల్లో నటించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో నాలోని నటిని అందరికీ చూపించడానికి ‘రుద్ర’తో మంచి అవకాశం వచ్చింది. ఇకపై నా నుంచి అన్నీ విభిన్నమైన సినిమాలే వచ్చేలా చూసుకుంటా’’ అని రాశి అంది.
This post was last modified on March 30, 2022 4:18 pm
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…
భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల…
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…