ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సౌత్ ఇండియాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఏదంటే మరో మాట లేకుండా ‘కేజీఎఫ్-2’ పేరు చెప్పేయొచ్చు. నిజానికి దీని క్రేజ్ కేవలం సౌత్ ఇండియాకు పరిమితం కాదు కూడా. ‘కేజీఎఫ్-1’ ఉత్తరాదిన కూడా సూపర్ హిట్టయిన నేపథ్యంలో అక్కడి ప్రేక్షకులు కూడా ‘కేజీఎఫ్-2’ కోసం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఏప్రిల్-14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
వివిధ ఇండస్ట్రీల్లో దీనికి పోటీగా సినిమాలు దించడానికి భయపడుతున్నారు. తెలుగులో కూడా ఆ వీకెండ్లో చెప్పుకోదగ్గ రిలీజ్ ఏదీ లేదు. హిందీలో సైతం ఇప్పటికైతే ‘కేజీఎఫ్-2’కు పోటీ లేనట్లే కనిపిస్తోంది. కానీ తమిళంలో మాత్రం ఓ భారీ చిత్రం ‘కేజీఎఫ్-2’తో పోటీకి సై అంటోంది. ఆ చిత్రమే.. బీస్ట్. ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ లీడ్ రోల్లో కోలమావు కోకిల, డాక్టర్ చిత్రాలతో సూపర్ హిట్లు కొట్టిన నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన చిత్రమిది.
గత కొన్నేళ్ల నుంచి విజయ్ ఊపు మామమూలుగా లేదు. రజినీకాంత్ సహా అందరినీ వెనక్కి నెట్టేసి టాప్ ప్లేస్కు వెళ్లిపోయాడతను. అతడి సినిమాలు టాక్తో సంబంధం లేకుండా బ్లాక్బస్టర్లవుతున్నాయి. వసూళ్ల మోత మోగించి రికార్డులు బద్దలు కొడుతున్నాయి. గత ఏడాది ‘మాస్టర్’ డివైడ్ టాక్ను తట్టుకుని బ్లాక్బస్టర్ అయింది. అసలే విజయ్, ఆపై నెల్సన్తో సినిమా కావడంతో అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. బీస్ట్’ చిత్రాన్ని ఏప్రిల్ 14కే అనుకున్నప్పటికీ.. ‘కేజీఎఫ్-2’ ఆ డేట్కే ఫిక్సవడంతో విజయ్ సినిమా వాయిదా పడుతుందేమో అన్న సందేహాలు కలిగాయి.
కేజీఎఫ్-2 పాన్ ఇండియా మూవీ కాబట్టి దాని డేట్ మార్చడానికైతే అవకాశం లేదు. అలాగని విజయ్ సినిమా కూడా వెనక్కి తగ్గలేదు. తమిళనాడు అవతల ‘కేజీఎఫ్-2’ వల్ల వసూళ్లలో బాగా కోత ఉంటుందని, తమిళనాట కూడా గట్టి పోటీ తప్పదని తెలిసినా విజయ్ మూవీ తగ్గలేదు. ఒక్క రోజు ముందుగా ఏప్రిల్ 13నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేయబోతున్నారు. సినిమాకు సెన్సార్ కూడా పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగానే డేట్ ప్రకటించబోతున్నారు. ‘కేజీఎఫ్-2’కు భయపడి తన సినిమాను వాయిదా వేయడమేంటని విజయ్ పంతానికి పోతున్నాడేమో అన్న చర్చ నడుస్తోంది. మరి ‘కేజీఎఫ్-2’ను ఢీకొట్టి ఓవరాల్గా ‘బీస్ట్’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
This post was last modified on March 22, 2022 10:00 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…