తన గురించి తాను పబ్లిసిటీ ఇచ్చుకోవడంలో నాగచైతన్య కాస్త డల్ అనే చెప్పాలి. మొహమాటం ఎక్కువ. ఎక్కువ చొరవ తీసుకొని చొచ్చుకుపోలేడు. తన పనేంటో తనది అన్నట్టు ఉంటాడు. కానీ విడాకుల తర్వాత తనలో కాస్త మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. ఇంటర్వ్యూల్లో, ఈవెంట్స్లో ఓపెన్గా మాట్లాడుతున్నాడు. పైగా ఇప్పుడు కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు.
వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న చైతు.. ఇప్పుడు ఫుడ్ బిజినెస్లోకి దిగాడు. షోయూ పేరుతో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘నేనెప్పుడూ మంచి ఫుడ్ కోసం వెతుకుతుంటాను. ప్రపంచమంతా తిరిగి రకరకాల వంటకాల్ని రుచి చూశాను. కానీ ఏషియన్ ఫుడ్డే నాకు బాగా ఇష్టం. దాన్నే మీకోసం రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను’ అంటూ తన బిజినెస్ని పరిచయం చేశాడు.
తనకో మంచి టీమ్ దొరికిందని, వారి సాయంతో మంచి మంచి వంటల్ని రుచి చూపిస్తానని చెబుతున్నాడు చైతు. స్విగ్గీలో ఆర్డర్ చేసుకోవచ్చని కూడా చెప్పాడు. తన పోస్ట్కి వెంకటేష్ కూతురు ఆశ్రిత రియాక్టయ్యింది. కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా అంటూ విష్ చేసింది. సరిగ్గా చేయడం రావాలే కానీ ఫుడ్ బిజినెస్ని మించింది లేదు. పని తప్ప వేరే ధ్యాస ఉండని చైతు అందులోకి దిగాడంటే షోయూని బెస్ట్ బ్రాండ్గా నిలబెట్టేందుకు ఫుల్ చాన్సెస్ ఉన్నాయి.
నిజానికి సమంతతో కలిసి ఉన్నప్పుడు చైతుని ఆమెతో పోల్చి చూసేవారు కొందరు. ఎందుకంటే సమంత చాలా ఫాస్ట్. మార్కెట్లో దూసుకెళ్లడం తనకి బాగా తెలుసు. నిరంతరం లైమ్లైట్లో ఉండటం కూడా తనకి బాగా తెలిసిన విద్య. ఆ క్రమంలోనే ఓ బట్టల బ్రాండ్ కూడా పెట్టింది. చైతు మాత్రం ఎంతసేపూ సినిమాలే తప్ప వేరేవి పట్టించుకునేవాడు కాదు. కానీ తమ దారులు సెపరేట్ అయ్యాక ఇప్పుడు సమంత రూట్లో వెళ్తున్నాడు చైతు. బిజినెస్మేన్గా సక్సెస్ అవుతాడేమో చూద్దాం.
This post was last modified on March 5, 2022 11:31 am
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…
ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా రేసు గుర్రం రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.…