అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించిన హన్సిక కెరీర్.. కాస్త వేగంగానే డల్ అయ్యిందని చెప్పాలి. హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా బ్యాగ్లో పడటంతో టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడం తగ్గిపోయింది. కొందరు చిన్న హీరోలతో వర్క్ చేసినా సక్సెస్ ఆమెకి దూరంగానే ఉండిపోయింది. దాంతో ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించింది.
శివరాత్రి సందర్భంగా హన్సిక కొత్త సినిమా మొదలయ్యింది. తమిళంలో రీమేక్ సినిమాలకి ఫేమస్ అయిన ఆర్.కణ్ణన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం అతను మలయాళ హిట్ ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ని తమిళంలో తీస్తున్నాడు. ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. మరో థ్రిల్లర్ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు హన్సికతో సినిమాని స్టార్ట్ చేశాడు.
హన్సికతో పాటు దర్శకుడికి కూడా వేరే కమిట్మెంట్స్ ఉండటంతో వీలైనంత వేగంగా ఈ సినిమాని పూర్తి చేసేలా ప్లాన్ చేసింది టీమ్. రెండే రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసేస్తారట. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఆగస్టు 15న మూవీని విడుదల చేసేస్తామని కూడా చెప్పేశారు. ఇది ఓ సైఫై సినిమా. హారర్ కామెడీ ప్రధానంగా సాగుతుంది. హన్సిక ఓ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతోంది.
హన్సిక కెరీర్ బెస్ట్ మూవీస్లో సి.సుందర్ తీసిన ‘ఆరణ్మణై’ ఫ్రాంచైజీ కూడా ఉంది. ఇంతవరకు మూడు మూవీస్ వచ్చాయి. మొదటి రెండు భాగాల్లోనూ హన్సిక నటించింది. ఆ రెండూ ఆమెకి మంచి సక్సెస్ని ఇచ్చాయి. ఆ తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు దక్కలేదు తనకి. ఇప్పుడు మరోసారి హారర్ జానర్ని సెలెక్ట్ చేసుకుంది. పైగా కణ్ణన్ లాంటి మంచి డైరెక్టర్ తీస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
This post was last modified on March 2, 2022 8:55 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…