నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, అభినయంతో అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
టాక్ బాగుండటం వల్ల ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దుమ్ము దులిపేస్తుంది. అంతా బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం నిత్యా మీనన్ బాగా హట్టైందట. అసలేం జరిగిందంటే.. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ చిత్రీకరించిన `అంత ఇష్టం ఏందయ్యా` అనే మెలోడీ సాంగ్ సినిమా రిలీజ్కి ముందే భారీ రెస్పాన్స్ను దక్కించుకుంది.
ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్ చిత్ర ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు. సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సాంగ్ యూట్యూబ్లో అనేక రికార్డులను సైతం కొల్లగొట్టింది. కానీ, సినిమాలో మాత్రం ఈ పాటను మేకర్స్ తొలగించి షాక్ ఇచ్చారు. దీంతో ఇంత మంచి సాంగ్ను ఎందుకు తీసేశారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. `మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే ఉద్ధేశంతో తొలగించాము` అంటూ తమన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ మెలోడీ సాంగ్ను తొలగించడంపై నిత్యా మీనన్ బాగా ఫీల్ అయిందని అంటున్నారు.
This post was last modified on March 1, 2022 11:13 am
తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. రాఘవేంద్రరావు, మురళీమోహనరావు లాంటి సీనియర్లు ఎప్పుడో బాలీవుడ్లో సినిమాలు తీశారు.…
ఏపీలో అధికార పక్షం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీలో కొందరు నేతల సొంత నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కూటమి…
ఏపీలోని పలు పురపాలికల్లో ఖాళీగా ఉన్న పదవుల భర్తీ నేపథ్యంలో తిరుపతిలో ఆదివారం నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.…
మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎందరో ఫిలిం మేకర్స్ ఎదురు చూస్తున్న ఎస్ఎస్ఎంబి 29 ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే.…
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందా? అలాంటిదేమీ లేకున్నా..…
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…