నిత్యా మీనన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, అభినయంతో అనతి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా.. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.
మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియుమ్`కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. తమన్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
టాక్ బాగుండటం వల్ల ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ దుమ్ము దులిపేస్తుంది. అంతా బాగానే ఉన్నా.. ఒక్క విషయంలో మాత్రం నిత్యా మీనన్ బాగా హట్టైందట. అసలేం జరిగిందంటే.. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ చిత్రీకరించిన `అంత ఇష్టం ఏందయ్యా` అనే మెలోడీ సాంగ్ సినిమా రిలీజ్కి ముందే భారీ రెస్పాన్స్ను దక్కించుకుంది.
ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్ చిత్ర ఈ పాటను ఎంతో అద్భుతంగా ఆలపించారు. సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ సాంగ్ యూట్యూబ్లో అనేక రికార్డులను సైతం కొల్లగొట్టింది. కానీ, సినిమాలో మాత్రం ఈ పాటను మేకర్స్ తొలగించి షాక్ ఇచ్చారు. దీంతో ఇంత మంచి సాంగ్ను ఎందుకు తీసేశారంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. `మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే ఉద్ధేశంతో తొలగించాము` అంటూ తమన్ చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఈ మెలోడీ సాంగ్ను తొలగించడంపై నిత్యా మీనన్ బాగా ఫీల్ అయిందని అంటున్నారు.
This post was last modified on March 1, 2022 11:13 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…