భీమ్లా ఎఫెక్ట్.. బాగా హ‌ట్టైన‌ నిత్యా మీన‌న్..

నిత్యా మీన‌న్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, అభిన‌యంతో అన‌తి కాలంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యా.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో న‌టించిన చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా.. నిత్యా మీన‌న్‌, సంయుక్త‌ మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

మలయాళ సూప‌ర్ హిట్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌గా.. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చారు. ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌లైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

టాక్ బాగుండ‌టం వ‌ల్ల ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబడుతూ దుమ్ము దులిపేస్తుంది. అంతా బాగానే ఉన్నా.. ఒక్క విష‌యంలో మాత్రం నిత్యా మీన‌న్ బాగా హ‌ట్టైంద‌ట‌. అస‌లేం జ‌రిగిందంటే.. పవన్ కళ్యాణ్- నిత్య మీనన్ నడుమ చిత్రీక‌రించిన‌ `అంత ఇష్టం ఏందయ్యా` అనే మెలోడీ సాంగ్ సినిమా రిలీజ్‌కి ముందే భారీ రెస్పాన్స్‌ను ద‌క్కించుకుంది.

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ రాయగా.. సింగర్‌ చిత్ర ఈ పాట‌ను ఎంతో అద్భుతంగా ఆలపించారు. సినీ ప్రియుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్న ఈ సాంగ్ యూట్యూబ్‌లో అనేక రికార్డుల‌ను సైతం కొల్ల‌గొట్టింది. కానీ, సినిమాలో మాత్రం ఈ పాట‌ను మేక‌ర్స్ తొల‌గించి షాక్ ఇచ్చారు. దీంతో ఇంత మంచి సాంగ్‌ను ఎందుకు తీసేశారంటూ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌గా.. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

ఆయ‌న మాట్లాడుతూ..  `మంచి వేడి మీద సాగుతున్న సన్నివేశాల నడుమ కూల్‌గా అనిపించే ఈ సాంగ్ ఉంటే బాగుండదనే ఉద్ధేశంతో తొల‌గించాము` అంటూ త‌మ‌న్ చెప్పుకొచ్చారు. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ మెలోడీ సాంగ్‌ను తొల‌గించ‌డంపై నిత్యా మీన‌న్ బాగా ఫీల్ అయింద‌ని అంటున్నారు.