కార్తికేయ గుమ్మకొండ.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ప్రేమతో మీ కార్తీక్` అనే మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన కార్తికేయ.. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన `ఆర్ఎక్స్ 100`తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో కార్తికేయకు కావాల్సినంత ఫేమ్ దక్కింది.
అయితే ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేశాడీయన. కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. ఈయన చివరిగా నటించిన `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` చిత్రాలు రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ప్రస్తుతం కార్తికేయ `వలిమై` సినిమాతో పలకరించబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కార్తికేయ విలన్గా నటించాడు.
ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా.. బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 24న తమిళంలో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్లో `వలిమై`ను సూపర్గా ప్రమోట్ చేసిన కార్తికేయ.. ఓ విషయంలో మాత్రం పప్పులో కాలేశాడు. అసలేమైందంటే.. కార్తికేయ స్టేజ్పై మాట్లాడుతూ సినిమా విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ అవుతోంది. కానీ నవంబర్ 24న అంటూ ఆయన నోరు జారేశాడు. అయితే కొద్ది సేపటికి తప్పు తెలుసుకున్న కార్తికేయ.. వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు.
`ఇందాక మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పాను.. కన్ఫ్యూజన్లో ఫిబ్రవరి 24కు బదులు నవంబర్ 24 అని అనేశాను. నిజానికి అది నా పెళ్లి రిసెప్షన్ రోజు. క్షమించండి` అంటూ కార్తికేయ తన తప్పును సరిచేసుకున్నాడు. కాగా, ఈ యంగ్ హీరో గత ఏడాదే ఓ ఇంటివాడయ్యాడు. 11 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహితను కార్తికేయ నవంబర్లో వివాహం చేసుకున్నాడు.
This post was last modified on February 23, 2022 12:21 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…