కార్తికేయ గుమ్మకొండ.. ఈయన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ప్రేమతో మీ కార్తీక్` అనే మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన కార్తికేయ.. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన `ఆర్ఎక్స్ 100`తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. 2018లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో కార్తికేయకు కావాల్సినంత ఫేమ్ దక్కింది.
అయితే ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేశాడీయన. కానీ, సరైన హిట్ మాత్రం పడలేదు. ఈయన చివరిగా నటించిన `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` చిత్రాలు రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి. ప్రస్తుతం కార్తికేయ `వలిమై` సినిమాతో పలకరించబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కార్తికేయ విలన్గా నటించాడు.
ఈ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకత్వం వహించగా.. బోణీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 24న తమిళంలో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మేకర్స్.. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్లో `వలిమై`ను సూపర్గా ప్రమోట్ చేసిన కార్తికేయ.. ఓ విషయంలో మాత్రం పప్పులో కాలేశాడు. అసలేమైందంటే.. కార్తికేయ స్టేజ్పై మాట్లాడుతూ సినిమా విడుదల తేదీని మరిచిపోయాడు. ఫిబ్రవరి 24న వలిమై రిలీజ్ అవుతోంది. కానీ నవంబర్ 24న అంటూ ఆయన నోరు జారేశాడు. అయితే కొద్ది సేపటికి తప్పు తెలుసుకున్న కార్తికేయ.. వెంటనే అందరికీ క్షమాపణలు చెప్పాడు.
`ఇందాక మాట్లాడుతూ విడుదల తేదీని తప్పుగా చెప్పాను.. కన్ఫ్యూజన్లో ఫిబ్రవరి 24కు బదులు నవంబర్ 24 అని అనేశాను. నిజానికి అది నా పెళ్లి రిసెప్షన్ రోజు. క్షమించండి` అంటూ కార్తికేయ తన తప్పును సరిచేసుకున్నాడు. కాగా, ఈ యంగ్ హీరో గత ఏడాదే ఓ ఇంటివాడయ్యాడు. 11 ఏళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రేయసి లోహితను కార్తికేయ నవంబర్లో వివాహం చేసుకున్నాడు.
This post was last modified on February 23, 2022 12:21 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…