మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవి కాకుండా.. దర్శకుడు బాబీతో ఓ సినిమా అలానే.. వెంకీ కుడుములతో మరో సినెమా చేయబోతున్నారు.
అయితే వెంకీ కుడుములతో మెగాస్టార్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. కథ ప్రకారం సినిమాలో చిరు మాఫియా డాన్ గా కనిపిస్తారట. అలా అని సినిమా మొత్తం సీరియస్ గా ఉండదట. కామెడీ ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ స్టైల్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో సినిమాను రూపొందించనున్నారు.
ఇప్పటికే వెంకీ కుడుముల స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చిరుకి ఫైనల్ డ్రాఫ్ట్ బాగా నచ్చిందట. ప్రస్తుతం నటీనటులను, టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేయనున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఏప్రిల్ 29న చిరు నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. అలానే ఈ ఏడాదిలో చిరు నుంచి మరో సినిమా రానుంది. వచ్చే ఏడాది ఎలా లేదన్నా.. మెగాస్టార్ రెండు సినిమాలను రిలీజ్ చేయడం ఖాయం. ఆయన లైనప్ చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతున్నారు. మొత్తానికి ఈ రెండేళ్లలో చిరు అభిమానులకు విజువల్ ట్రీట్ ఖాయం.
This post was last modified on February 21, 2022 3:36 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…