మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ ‘లూసిఫర్’ సినిమాకి ఇది రీమేక్. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళాశంకర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవి కాకుండా.. దర్శకుడు బాబీతో ఓ సినిమా అలానే.. వెంకీ కుడుములతో మరో సినెమా చేయబోతున్నారు.
అయితే వెంకీ కుడుములతో మెగాస్టార్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. కథ ప్రకారం సినిమాలో చిరు మాఫియా డాన్ గా కనిపిస్తారట. అలా అని సినిమా మొత్తం సీరియస్ గా ఉండదట. కామెడీ ఓ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ స్టైల్ లో ఈ సినిమా ఉంటుందని టాక్. యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్ లో సినిమాను రూపొందించనున్నారు.
ఇప్పటికే వెంకీ కుడుముల స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. చిరుకి ఫైనల్ డ్రాఫ్ట్ బాగా నచ్చిందట. ప్రస్తుతం నటీనటులను, టెక్నీషియన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను అఫీషియల్ గా లాంఛ్ చేయనున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు.
ఏప్రిల్ 29న చిరు నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. అలానే ఈ ఏడాదిలో చిరు నుంచి మరో సినిమా రానుంది. వచ్చే ఏడాది ఎలా లేదన్నా.. మెగాస్టార్ రెండు సినిమాలను రిలీజ్ చేయడం ఖాయం. ఆయన లైనప్ చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతున్నారు. మొత్తానికి ఈ రెండేళ్లలో చిరు అభిమానులకు విజువల్ ట్రీట్ ఖాయం.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…