ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కొన్ని రోజుల కిందట మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రతినిధుల బృందం సమావేశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో తెలిసిందే. ఈ సమావేశానికి చిరుతో పాటు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, కొరటాల శివ తదితరులు వెళ్లారు. ఐతే టాలీవుడ్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్లుల్లో ఒకరైన మోహన్ బాబు ఈ మీటింగ్కు వెళ్లలేదు. ఆయనకు పిలుపు లేదా.. లేక ఆయనే వెళ్లలేదా అనే విషయంలో మొన్నటిదాకా ఎవరికీ స్పష్టత లేదు.
కానీ ఇటీవల సీఎం జగన్ను వ్యక్తిగతంగా వెళ్లి కలిసిన మంచు విష్ణు.. సీఎంవో నుంచి తన తండ్రికి కూడా ఆహ్వానం పంపారని.. కానీ ఆ ఇన్విటేషన్ అందకుండా చేశారని.. వాళ్లెవరో తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. వాళ్లెవరో చెప్పమంటే మాత్రం అది ఇండస్ట్రీకి సంబంధించిన అంతర్గత విషయమని.. ఆ వివరాలు బయటపెట్టబోనని అన్నాడు.కాగా తన కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు.. ఇదే విషయమై మాట్లాడారు.
‘‘ఇటీవల సినిమా టికెట్ల ధరల విషయమై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడటానికి అందరం కలిసి వెళ్దామని రెండు నెలల కిందట బహిరంగ లేఖ రాశాను. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. నటీనటులు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉన్నారన్నారు. బిజీగా ఉన్నా కూడా వీలు చేసుకుని చర్చించడానికి రావాలి. కానీ ఎవరూ స్పందించలేదు. ఎందుకంటే వాళ్లకు ఇగో. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఏపీ సీఎంతో చర్చించడానికి వెళ్లారు. సీఎంవో నుంచి నాకు కూడా ఆహ్వానం ఉంది.
నన్ను కూడా చర్చలకు పిలవాలని ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ విషయాన్ని వాళ్లు నాకు చెప్పలేదు. నన్ను రమ్మనీ పిలవలేదు. వాళ్లు పిలిచినా పిలవకపోయినా నాకంటూ ఒక చరిత్ర, గౌరవం, విలువ ఉన్నాయి. నా పని నేను చేసుకుంటున్నాను. ఎదుటి వాళ్లకు చేతనైన సాయం చేస్తున్నాను. నా గురించి ఎవరో ఏదో అనుకుంటే వాళ్ల కర్మ. ఎదుటివారి మాటలను నేను పట్టించుకోను’’ అని మోహన్ బాబు అన్నారు. చిత్ర పరిశ్రమ అంతా ఒకటే కుటుంబం అంటూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని.. ఎవరి గోతులు వాళ్లే తీసుకుంటున్నారని కూడా మోహన్ బాబు వ్యాఖ్యానించారు.
This post was last modified on February 18, 2022 6:55 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…